Director Varanasi Surya : ఏపీ రాజకీయాల్లో వైసీపీ టార్గెట్ ప్రస్తుతం టీడీపీ కాదు జనసేన. జనసేన, వైసీపీ రెండు పార్టీలు వ్యూహత్మకంగా ఒకరినొకరు తిట్టుకుంటూ టీడీపీ ని సైడ్ ట్రాక్ లోకి నెడుతున్నారు అనే వాదన ఒకవైపు వినిపిస్తోంది. అయితే వైసీపీ పదే పదే పవన్ ను టార్గెట్ చేయడమే కాకుండా మరోవైపు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ద్వారా జనసేన, మరోవైపు టీడీపీ ఇద్దరికీ పంచులు వేయిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా జనసేన కు సపోర్ట్ చేస్తూ డైరెక్టర్ వారణాసి రంగంలోకి దిగారు.
మాట్లాడితే మూడు పెళ్లిళ్లు తప్ప మరేం లేదు…
వైసీపీ పార్టీ నేతల గురించి వారణాసి సూర్య మాట్లాడుతూ, మాట్లాడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గురించి తప్ప మరో విషయం మాట్లాడటానికి వైసీపీ వాళ్లకు మరో మ్యాటర్ లేదు. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకున్నా లీగల్ గా విడిపోయి చేసుకున్నారు, ఎవరికీ అన్యాయం చేయలేదు. కానీ వీళ్ళు పదే పదే ఈ విషయం గెలుకుతూ పవన్ ను గిల్లుతుంటారు.
వైసీపీ సోషల్ మీడియా నుండే పవన్ మూడో భార్యకి విడాకులు అంటూ రూమర్స్ బయటికి వస్తున్నాయి. అవన్నీ ఒట్టి రూమర్స్ మాత్రమే అందులో నిజం లేదు. ఈ క్లారిటీ ఇవ్వకపోతే జనాలు వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని నిజం అనుకుంటారు. మా నాయకుడి మీద విమర్శలను చేయడానికి మరో అంశం దొరక్క వైసీపీ వాళ్ళు ఇంట్లో ఆడవాల్ల మీద పడ్డారు అంటూ వారణాసి సూర్య ఫైర్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…