YS Jagan: జగన్ ఇంటిపై దాడి.. తప్పుడు వార్తలను ఖండించిన వైసీపీ.. జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు!

YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మొదటిసారి పులివెందులకు చేరుకున్నారు. నిన్న ఈయన కడప ఎయిర్ పోర్ట్ లో దిగి అక్కడ నుంచి రోడ్డు మార్గనా పులివెందులకు వెళ్లారు. అయితే పెద్ద ఎత్తున అభిమానులు ఈయనకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికారు. ఇక పులివెందులలో కూడా అభిమానులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

ఈ క్రమంలోనే పులివెందులకు పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడంతో టీడీపీ నేతలు కార్యకర్తలు తప్పుడు వార్తలను ప్రచారం చేశారు. జగన్ పై వ్యతిరేకత ఉండటంతోనే ఆయన ఇంటిపై దాడి చేశారని తెలిపారు. ఇంట్లో గ్లాసులను పగలగొట్టారు అంటూ తప్పుడు వార్తలను ప్రచారం చేశారు అయితే ఈ వార్తలపై వైసీపీ స్పందించింది.

జగన్ ఇంటి పై దాడి జరిగిందంటూ వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ఫలితాలు తర్వాత మొదటిసారి పులివెందులకు రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని దీంతో కాస్త పెనుగులాట చోటు చేసుకోవడం వల్ల ఇంట్లో గాజు సామాన్లు పగిలిపోయాయని అంతకుమించి ఎలాంటి వ్యతిరేకత లేదని తెలిపారు.

జగన్ ఇంటి వద్ద భద్రత పెంపు..

ఇక జగన్మోహన్ రెడ్డి చాలా రోజుల తర్వాత పులివెందులకు రావడంతో అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది అయితే పోలీసులు వారందరినీ కంట్రోల్ చేయడంలో విఫలమయ్యారు దీంతో నేడు జగన్ ఇంటి వద్ద భద్రతను పెంచారు. మరో నాలుగు రోజులపాటు జగన్ పులివెందులలోనే ఉంటూ అక్కడ నాయకులతో సమావేశం కానున్న సంగతి తెలిసిందే.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago