నేడు, రేపు అంటే సెప్టెంబర్ 4 మరియు సెప్టెంబర్ 5 న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల్లో అంతరాయం కలగనుందని .. ఎస్బీఐ ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ మేరకు తమ ఖాతాదారులు దీనిని గమనించాలని సూచించారు. బ్యాంక్ నిర్వహణ కార్యకలాపాలను సెప్టెంబర్ 4 రాత్రి 10.35 నుంచి సెప్టెంబర్ 5 మధ్యాహ్నం 1.35 గంటల వరకు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపారు.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించి యోనో బిజినెస్, యోనో, యోనో లైట్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వంటివి నిలిచిపోనున్నాయి. ఈ మేరకు తన బ్యాంకులో ఉన్న 44 కోట్ల ఖాతాదారులను అలర్ట్ చేసింది. ఇటువంటి అంతరాయానికి మీము చింతిస్తున్నామంటూ కూడా ట్వీట్ చేసింది. ఇలా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో సేవలకు అంతరాయం కలగడం ఇది మొదటి సారి కాదు..
2021లోనే నాలుగైదు సార్లు ఇలానే అంతరాయాన్ని కలిగించారు. జూలై 16 మరియు 17లో మరియు ఆగస్టు 6, 7 తేదీల్లో కూడా ఇలా అంతరాయం కలిగించింది. వెంటనే ఎస్బీఐ సేవలను పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.
అంతేకాకుండా కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని..బ్యాంక్ బ్రాంచ్ కు వచ్చే ప్రతీ ఒక్కరూ మాస్క్ ధరించాలంటూ ఖాతాదారులకు సూచించారు. ఇతరులకు ఎట్టి పరిస్థితుల్లో బ్యాంక్ కు సంబంధించి వివరాలను షేర్ చేయకూడదని తెలిపారు. అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే.. బ్యాంక్ కు సంబంధించిన ఫోన్ నంబర్ కు కాల్ చేయాలన్నారు.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…