Avasarala Srinivas: అవసరాల శ్రీనివాస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు ఈయన నటుడిగా దర్శకుడిగా స్క్రిప్ట్ రైటర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా దర్శకుడిగా మారిన అవసరాల శ్రీనివాస్ తను రాసిన కథలకు తానే దర్శకుడిగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి ఈయన తాజాగా నాగశౌర్య, మాళవిక నాయక్ జంటగా నటించిన ఫలానా అబ్బాయి..ఫలానా అమ్మాయి సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. ఈ సినిమా మార్చ్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ఇక ఈ చిత్రాన్ని ఒక లవ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.
ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా అవసరాల శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూలో భాగంగా అవసరాలు శ్రీనివాస్ ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత లేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఇండస్ట్రీలో రచయితలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారి కష్టాన్ని గుర్తించి వారికి సరైన రెమ్యూనరేషన్ కూడా ఇవ్వకుండా ఎగ్గొడుతున్నారు అంటూ ఈయన సంచలన వ్యాఖ్యలు చేశారు అందుకే తన కథలను ఇతరులకు ఇవ్వకుండా తానే సినిమాలు చేస్తున్నానని అయితే తన సినిమా కథలకు డబ్బులు ఇస్తే ఇతరులకు కూడా ఇస్తానని ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఇలా రచయితలకు డబ్బులు ఇవ్వరు అంటూ అవసరాల శ్రీనివాస్ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…