స్టార్ మాలో ప్రసారం అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని రేపో, మాపో ఐదవ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే బిగ్బాస్ 4 హౌజ్లో క్లోజ్గా ఉన్న కంటెస్టెంట్లలో అరియానా, అవినాష్ జంట ఒకటి.
హౌజ్లోకి వెళ్లిన కొత్తలో వీరిద్దరి మధ్య పెద్దగా ర్యాపో లేనప్పటికీ.. ఆ తరువాత బాగా క్లోజ్ అయ్యారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కానీ ఈ మధ్య వారిద్దరు ఎక్కువగా సోషల్ మీడియాలో అయినా.. యూట్యూబ్ లో అయినా అభిమానులతో ముచ్చటించడం మానేశారు. దానికి కారణం ఏంటనేది తాజాగా విడుదలైన ‘కామెడీ స్టార్ ’ షోలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రోమో చివరలో అవినాష్, అరియానా ను ప్రశ్నిస్తూ యాంకర్ శ్రీముఖి ప్రశ్నిస్తూ.. మీరెందుకు విడిపోయారంటూ అడిగింది. దానికి అరియానా గ్లోరీ మాట్లాడుతూ.. ఆ గొడవ తర్వాత కూడా గొడవ ఎందుకైందో.. ఎలా జరిగిందో మా ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడినా తమకు తెలియదని.. గొడవ తర్వాత మాట్లాడొద్దు అనే ప్రభావం ఎక్కువగా ఇంపాక్ట్ చూపించదన్నారు.
దీనిపై అవినాష్ మాట్లాడుతూ.. స్నేహితుడు తప్పు దోవలో వెళ్తుంటే ఇది రాంగ్ అని చెప్పానని.. వినకపోవడంతో మాట్లాడటం మానేశానని.. అయినా ఆమె వచ్చి సారీ చెప్పి మాట్లాడిందని అన్నారు. పొగరుబోతు ప్రవర్తన కూడా తగ్గించుకోమని చెప్పండి అని అరియానా.. జడ్జిలతో చెప్పింది. దీనికి సమాధానంగా అవినాష్.. మనిషి అన్న తర్వాత కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయన్నారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…