స్టార్ మాలో ప్రసారం అయిన బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లు విజయవంతంగా పూర్తి చేసుకొని రేపో, మాపో ఐదవ సీజన్ కూడా మొదలు కాబోతోంది. అయితే బిగ్బాస్ 4 హౌజ్లో క్లోజ్గా ఉన్న కంటెస్టెంట్లలో అరియానా, అవినాష్ జంట ఒకటి.
హౌజ్లోకి వెళ్లిన కొత్తలో వీరిద్దరి మధ్య పెద్దగా ర్యాపో లేనప్పటికీ.. ఆ తరువాత బాగా క్లోజ్ అయ్యారు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వారిద్దరి మధ్య స్నేహం కొనసాగింది. కానీ ఈ మధ్య వారిద్దరు ఎక్కువగా సోషల్ మీడియాలో అయినా.. యూట్యూబ్ లో అయినా అభిమానులతో ముచ్చటించడం మానేశారు. దానికి కారణం ఏంటనేది తాజాగా విడుదలైన ‘కామెడీ స్టార్ ’ షోలో వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. ప్రోమో చివరలో అవినాష్, అరియానా ను ప్రశ్నిస్తూ యాంకర్ శ్రీముఖి ప్రశ్నిస్తూ.. మీరెందుకు విడిపోయారంటూ అడిగింది. దానికి అరియానా గ్లోరీ మాట్లాడుతూ.. ఆ గొడవ తర్వాత కూడా గొడవ ఎందుకైందో.. ఎలా జరిగిందో మా ఇద్దరినీ కూర్చొబెట్టి మాట్లాడినా తమకు తెలియదని.. గొడవ తర్వాత మాట్లాడొద్దు అనే ప్రభావం ఎక్కువగా ఇంపాక్ట్ చూపించదన్నారు.
దీనిపై అవినాష్ మాట్లాడుతూ.. స్నేహితుడు తప్పు దోవలో వెళ్తుంటే ఇది రాంగ్ అని చెప్పానని.. వినకపోవడంతో మాట్లాడటం మానేశానని.. అయినా ఆమె వచ్చి సారీ చెప్పి మాట్లాడిందని అన్నారు. పొగరుబోతు ప్రవర్తన కూడా తగ్గించుకోమని చెప్పండి అని అరియానా.. జడ్జిలతో చెప్పింది. దీనికి సమాధానంగా అవినాష్.. మనిషి అన్న తర్వాత కోపాలు, తాపాలు అన్నీ ఉంటాయన్నారు.
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…
ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…