RRR Movie: దేశవ్యాప్తంగా ఎంతోమంది సినీ అభిమానులు ఎదురుచూస్తున్నటువంటి RRR సినిమా ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా హౌస్ఫుల్ బోర్డులు కనబడుతున్నాయి. థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున అభిమానులు చేరుకొని భారీ ఎత్తున హంగామా చేస్తున్నారు.
ఇలా ప్రతి చోటా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టి సందడి చేస్తున్న ఈ సినిమాకి కర్ణాటకలో మాత్రం చేదు అనుభవం ఎదురైందని చెప్పాలి. కర్ణాటకలో ఈ సినిమా థియేటర్లు హౌస్ఫుల్ బోర్డులతో దర్శనం ఇవ్వకుండా ఖాళీగా కనిపించడం కాస్త నిరాశకు గురిచేస్తుంది. అయితే అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాని అవాయిడ్ చేయడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే….
తెలంగాణ కర్ణాటక బోర్డర్ లో ఉన్నటువంటి కొన్ని థియేటర్లలో కూడా ఈ సినిమా విడుదలైంది. అయితే అక్కడ కన్నడ వారి కన్నా తెలుగువారు అధికంగా ఉండటం వల్ల ఈ సినిమాని కన్నడ భాషలో కాకుండా తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఇలా కన్నడ భాషలో ఈ సినిమా ఉన్నప్పటికీ తెలుగులో ప్రసారం చేయటం వల్ల కన్నడ ప్రేక్షకులు ఈ సినిమాపై నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమా చూడటానికి పెద్దగా కన్నడ ప్రేక్షకులు ఆసక్తి చూపించకపోవడం వల్ల హౌస్ ఫుల్ బోర్డ్ కనిపించాల్సిన థియేటర్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. ఇలా కన్నడ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసిన ఈ సినిమా పట్ల నిరసన వ్యక్తం చేస్తూ ఈ సినిమాని బాయ్ కాట్ చేయాలంటూ కన్నడ ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయం తెలిసి అప్పటికే రంగంలోకి దిగిన మేకర్స్ ఈ సినిమా గురించి క్లారిటీ ఇచ్చిన కన్నడిగులు మాత్రం ఈ సినిమాను చూడటానికి ఇష్టపడలేదని చెప్పాలి.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…