General News

RCB ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్! జట్టును అమ్మేస్తున్నారా? కొత్త యజమాని ఎవరు?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. ఐపీఎల్‌లో మోస్ట్ పాపులర్ టీమ్స్‌లో ఒకటి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ ఈసారి ఐపీఎల్ టైటిల్‌ను కొట్టేసింది. ఆర్‌సీబీ టీమ్, ఫ్యాన్స్ సంబరాలకు అంతే లేకుండా పోయింది. కానీ ఇప్పుడు వింటుంటే.. ఆర్‌సీబీ ఫ్రాంచైజీనే అమ్మేయడానికి రెడీ అవుతున్నారట! ఇది నిజంగా షాకింగ్ కదా? కొత్త ఓనర్ రాబోతున్నాడా ఏంటి?

ప్రస్తుత ఓనర్ డియాజియో.. జట్టును అమ్మేయడానికి ఆలోచిస్తున్నారట. పూర్తిగా అమ్మేస్తారో.. లేక కొంత షేర్ మాత్రమే అమ్ముతారో చూడాలి. దీని విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.16,384 కోట్లు అన్నమాట!

డియాజియో పీఎల్‌సీ వాళ్లు ఆర్‌సీబీలో కొంత వాటా లేదా పూర్తిగా అమ్మేయడానికి కొందరితో చర్చలు జరుపుతున్నారట. ఈ న్యూస్ బయటకు రాగానే యునైటెడ్ స్పిరిట్స్ షేర్ల ధరలు కూడా పెరిగాయి. ఒక్కసారిగా స్టాక్ ధర 3.3% పెరిగిందంటే చూడండి.. ఆర్‌సీబీకి ఎంత క్రేజ్ ఉందో!

అయితే.. ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకోలేదని సమాచారం. దీని గురించి కంపెనీ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

గుర్తుండే ఉంటుంది.. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు ఆర్‌సీబీ టీమ్‌ను విజయ్ మాల్యా కొన్నారు. ఆ తర్వాత ఆయన అప్పుల్లో కూరుకుపోవడంతో పరిస్థితి మారిపోయింది. అప్పుడు డియోజియో వాళ్లు స్పిరిట్స్ బిజినెస్‌ను కొనుగోలు చేసి ఆర్‌సీబీకి ఓనర్ అయ్యారు.

చూద్దాం ఏం జరుగుతుందో! ఆర్‌సీబీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

telugudesk

Recent Posts

‘పసివాడి ప్రాణం’ నటుడు బాబు ఆంటోనీ లైఫ్ ఇలా మారిపోయింది!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…

23 hours ago

చూపు లేకపోయినా సంగీతంతో ప్రపంచాన్ని గెలిచిన వైకమ్ విజయలక్ష్మి!

చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…

23 hours ago

కురుక్షేత్ర యుద్ధానికి దూరంగా నిలిచిన మహా యోధులు వీరే..!

మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…

23 hours ago

కొత్త దంపతులు ముత్యాలు ధరిస్తే ఇంత మార్పా..? ముత్యాలపై నిపుణుల విశ్వాసం ఇదే!

భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…

24 hours ago

ఒకే రాశి వాళ్లు పెళ్లి చేసుకుంటే జీవితం ఎలా ఉంటుంది..? తెలుసుకుంటే ఆశ్చర్యమే!

వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…

24 hours ago

ఇంట్లో ఈ మొక్క ఉంటే చాలు అంటున్న వాస్తు నిపుణులు.. లక్ష్మీ కటాక్షం కలుగుతుందట!

హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…

1 day ago