Business and finance concept
కరోనా విజృంభణ నేపథ్యంలో మారిన ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు కస్టమర్లకు వరుస శుభవార్తలు చెబుతున్నాయి. రుణాలపై వడ్డీరేట్లను భారీగా తగ్గిస్తూ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తున్నాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ బజాజ్ ఫైనాన్స్ కూడా కస్టమర్లకు శుభవార్త చెప్పింది. బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ అయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలపై భారీగా వడ్డీరేట్లను తగ్గించింది.
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చేందుకు 6.9 శాతం నుంచే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ రుణాలు ప్రారంభం కానున్నాయి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై వడ్డీరేట్లను భారీగా తగ్గించడం గమనార్హం. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హోమ్ లోన్స్ పై 6.9 శాతం వడ్డీ వసూలు చేస్తుండగా ఎస్బీఐకు పోటీగా ఇంతే వడ్డీకి బజాజ్ ఫైనాన్స్ కస్టమర్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తుండటం గమనార్హం.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లో ఒక వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం కోటి రూపాయలు లోన్ తీసుకుంటే 6.9 శాతం వడ్డీ ప్రకారం చాలా తక్కువ మొత్తం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. గతంతో పోలిస్తే బజాజ్ ఫైనాన్స్ లో వడ్డీ రేట్లు తగ్గడం వల్ల హోం లోన్ తీసుకున్న వాళ్లకు లక్షల రూపాయలు ఆదా కానుందని తెలుస్తోంది. కోటి రూపాయల లోన్ కు 30 సంవత్సరాలను లోన్ టెన్యూర్ గా ఎంచుకుంటే లోన్ పూర్తయ్యే సమయానికి కోటీ 30 లక్షలు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.
అయితే సాధారణంగా బయట వడ్డీలతో పోలిస్తే బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ వడ్డీరేటుకే రుణాలు పొందే అవకాశం ఉండటంతో పాటు లోన్ చెల్లించడానికి ఎక్కువ కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…