Balakrishna : బాలయ్య బాబు ఏమి చేసినా దబిడి దిబిడే అంటే ఇదేనేమో. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఒక వీడియో చూసి ఫ్యాన్స్ అలానే అంటున్నారు. సరదాగా ఒక సాధారణ కుటుంబం తో కూర్చొని ముచ్చటిస్తూ వారితో కలిసి తినడం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇక ఫ్యాన్స్ అంతా మా బాలయ్యబాబు అంతే డౌన్ టూ ఎర్త్ అంటూ సంబరపడిపోతున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. బాలయ్య సరసన శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఇక సినిమాకోసం యూనిట్ అందరూ టర్కి వెళ్లారు. అక్కడ టిఫిన్ చేయడానికి ఒక హోటల్ వెళ్లిన బాలయ్య అక్కడి వాళ్ళతో కూర్చొని మాట్లాడిన వీడియో బాగా వైరల్ అవుతోంది.
సీరియల్స్ చూడక పోతే మైండ్ బాగుంటుంది…
ఒక సాధారణ కుటుంబంతో పాటు తినడానికి కూర్చున్న బాలకృష్ణ వారికి తనని పరిచయం చేసుకున్నారు
నేను హీరో, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ అంటూ చెప్పగా ఆ కుటుంబం మాకు తెలుసు మీరు అంటూ చెప్పారు. ఇక వారితో మాటా మంతి కలిపిన బాలయ్య.. ఏ పని లేకుండా ఉంటే బోర్ కొడుతుంది, ఏదోక పని చేయాలి, టీవీ చూడకూడదు అంటూ సలహా ఇచ్చారు. సీరియల్స్ చూస్తే మైండ్ చెడిపోతుంది, టీవీ చూడటం తగ్గిస్తే కళ్ళకు మంచిది “టీవీ నా దేఖనే సే భేజ కు అచ్చా హై”.. టీవీ అసలు చూడకుండా ఉంటే బ్రెయిన్ కి మంచిది అంటూ అక్కడున్న ఆడవాళ్లకు సలహా ఇచ్చారు.
ఈమాట అనడంతో ఒక్కసారిగా అందరూ నవ్వుకున్నారు నిజమే సార్ అంటూ అన్నారు. ఇక బాలయ్య ఏదో మంత్రం చదివి మందులు వేసుకున్నారు. ఇలా బాలకృష్ణ అందరితో సరదాగా మాట్లాడిన వీడియో ఇపుడు బాగా వైరల్ అవుతోంది. కొంచెం స్టార్ డమ్ వస్తేనే స్టేటస్ చూపించే సెలబ్రిటీలు ఉన్నా హోదా, స్టార్ డమ్ అన్నీ ఉన్న బాలయ్య ఇలా నిగర్విగా అందరితో కలిసిపోయి మాట్లాడటం చూసి చాలా మంది ఆశ్చర్య పోతున్నారు. తండ్రిలాగ బాలయ్య కూడా డౌన్ టూ ఎర్త్ అంటూ పొగిడేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…