Balakrishna: నందమూరి వారసుడు తారకరత్న అనారోగ్య సమస్యలతో గత 23 రోజులుగా పోరాడుతూ చివరికి మృత్యు కౌగిలిలో బందీ అయ్యారు. తారకరత్న అతి చిన్న వయసులోనే మరణించడంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తన ముగ్గురు పిల్లలు దిక్కుతోచని స్థితిలో అమాయకంగా తన తండ్రి వైపు చూస్తూ ఉన్నటువంటి సంఘటనలు అందరికీ కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇలా తారకరత్న గుండెపోటుకి గురై ఆస్పత్రిలో చేరిన క్షణం నుంచి ఆయనని ఎలాగైనా ప్రాణాలతో దక్కించుకోవాలని నందమూరి నటసింహం బాలకృష్ణ పడిన తపన ఆరాటం చూస్తుంటే వీరిద్దరికీ ఎంతో మంచి అనుబంధంగా ఉందని తెలుస్తోంది. ఈ విధంగా తారకరత్న కోసం ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించిన బాలయ్య తనని ఎలాగైనా దక్కించుకోవాలని ప్రయత్నాలు చేశారు.
ఇలా తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఈయన బెంగుళూరులోనే మకాం మారుస్తూ నిత్యం డాక్టర్లతో మాట్లాడుతూ అతనికి ఎంతో మెరుగైన వైద్య చికిత్సలు చేయించారు. ఇలా ఎన్ని చేసినప్పటికీ విధి చేతిలో తారకరత్న ఓడిపోవాల్సి వచ్చింది. ఇక తారకరత్న మరణించడంతో తన పిల్లల బాధ్యతలను తానే చూసుకుంటానని బాలకృష్ణ హామీ ఇచ్చారు.
ఇక తారకరత్నతో బాలయ్యకు ఎంతో మంచి అనుబంధం ఉందనే విషయం మనకు తెలుస్తుంది. గతంలో బాలకృష్ణ తారకరత్న ఎంతో ఆప్యాయంగా చనువుగా ఉన్నటువంటి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరి మధ్య ఎంతో మంచి రిలేషన్ ఉందని తెలుస్తోంది. ఇలా బాలయ్యకు తారకరత్నకు మధ్య ఉన్న అనుబంధంతోనే తనని ఎలాగైనా బ్రతికించుకోవాలని బాలయ్య ఆరాటపడ్డారు.ఇక బాలయ్యకు తారకరత్న పిల్లలతో కూడా ఎంతో మంచి అనుబంధం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న పిల్లలతో బాలయ్య కలిసి దిగిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…