Movie News

Balakrishna: వైసీపీని టార్గెట్ చేస్తూ బాలయ్య సినిమాలో డైలాగ్స్…

Balakrishna: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య ఎప్పుడు మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర టిడిపి కార్యకర్తలు కూడా అధికారపక్షం మీద మాటలతో విరుచుకుపడుతూ ఉంటారు. అలాగే వైసిపి కార్యకర్తలు కూడా టిడిపి పార్టీ నేతలపై మాటల దాడికి దిగుతూ ఉంటారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎల్లప్పుడూ అధికార పక్షం ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంటుంది.

ఇదిలా ఉండగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా అధికారపక్షం అధినేత అయిన సీఎం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఒక డైలాగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి సినిమా తెరకెక్కిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీన సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. దీంతో ఇప్పటికీ సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా సినిమా నుండి ట్రైలర్ విడుదల చేశారు.హై ఓల్టేజ్ యాక్షన్ సీన్స్‌తో కూడిన ఈ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలను మరింతగా పెంచేసింది.

ఈ సినిమాలో బాలకృష్ణ నుంచి ఆశించినవన్నీ ఉన్నాయని నందమూరి అభిమానులు, బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు .ఇక తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో బాలకృష్ణ చెప్పిన ఒక డైలాగ్ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో కానీ.. ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు’ అనే డైలాగ్‌ ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Balakrishna: చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు….

ఎందుకంటే గతంలో ఎన్టీఆర్ పేరు మీదుగా టిడిపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాలకు వైయస్సార్ పేరు మార్చాడు. అంతేకాకుండా ఇటీవల ఎన్టీఆర్ పేరు మీదుగా ఉన్న హెల్త్ యూనివర్సిటీ ని కూడా వైఎస్ఆర్ పేరు మీద మార్చడంతో టిడిపి కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఇలా వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం వారి చేతిలో ఉందని ఎన్టీఆర్ పేరు మీద ఉన్న ప్రతిదాన్ని వైయస్సార్ పేరుగా మార్చారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ చెప్పినట్లు నందమూరి అభిమానులు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పోషకాల ఖజానా అయిన పనస గింజలు…ఎందుకు పారేస్తున్నారు?

పనసపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. తియ్యటి రుచి, ప్రత్యేకమైన సువాసన, పోషకాలతో నిండిన ఈ పండు వేసవి కాలంలో…

13 minutes ago

జ్వరంతో ఉన్నప్పుడు చికెన్ తినొచ్చా..? నిజం ఏంటి.. వైద్య నిపుణులు ఏమంటున్నారు..?

జ్వరం వచ్చినప్పుడు ఆహారం విషయంలో అనేక సందేహాలు, అపోహలు ప్రజల్లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా మాంసాహార ఆహారం తీసుకోవచ్చా లేదా అనే…

19 minutes ago

అమెరికాలో స్థిరపడాలనుకునే భారతీయులకు భారీ షాక్..

అమెరికాలో స్థిరపడాలని, అక్కడే భవిష్యత్తును నిర్మించుకోవాలని కలలు కంటున్న లక్షలాది మంది భారతీయులకు కొత్త ఆందోళన మొదలైంది. ఇప్పటికే వీసా…

40 minutes ago

ఏపీలో ఉద్యోగులకు భారీ శుభవార్త.. పాత పెన్షన్ విధానం అమలు..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. ఉద్యోగ సంఘాలు చాలా కాలంగా కోరుతున్న అంశంపై సానుకూల…

46 minutes ago

చంద్ర బలంతో వారికి పట్టిందల్లా బంగారమే..! ఈ రాశుల వారికి అదృష్టం తలుపులు తెరుచుకోనున్నాయా..?

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రుడికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. మనస్సు, ఆలోచనలు, భావోద్వేగాలు, కుటుంబ జీవితం, ఆర్థిక స్థితి వంటి…

50 minutes ago

గ్రీన్ టీనా.. బ్లాక్ టీనా..? బరువు తగ్గాలంటే ఏది మంచిది.. అసలు నిజం ఇదే!

నేటి జీవన విధానంలో అధిక బరువు చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యగా మారింది. పని ఒత్తిడి, శారీరక శ్రమ…

54 minutes ago