Balakrishna -Prabhas: బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమం సీజన్ 2 ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది.ఇక ఈ సీజన్లో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రానున్నారని తెలియడంతో ఆ ఎపిసోడ్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ప్రభాస్ తో ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ రెండు భాగాలుగా విడుదల కానుందని ఆహా అధికారికంగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే తాజాగా మరొక ప్రోమో కూడా విడుదల చేశారు. ఈ ఎపిసోడ్ మొదటి భాగం డిసెంబర్ 30వ తేదీ ప్రసారం కానున్నట్లు ఆహా అధికారకంగా వెల్లడించింది. ఇక ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ తో కలిసి అన్ స్టాపబుల్ హంగామా చేశారు.ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ ప్రభాస్ ని ప్రశ్నిస్తూ నిన్ను మీ ఫ్రెండ్స్ ఎక్కువగా ఏమని పిలుస్తారని అడగగా డార్లింగ్ అని పిలుస్తారు.మరి అమ్మాయిలు ఏమని పిలుస్తారని అనడంతో అది ఏదో ఈ మధ్యకాలంలో అన్ని మర్చిపోతున్నాను సార్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు.
నేను కూడా నీ మాయలో పడిపోయాను. డార్లింగ్ అని పిలిస్తే దయ్యాలు కూడా దేవతలుగా మారిపోతాయి అంటూ బాలయ్య నవ్వులు పూయించారు. ఇక ఈ ప్రోమోలో భాగంగా ప్రభాస్ పెళ్లి గురించి కూడా బాలకృష్ణ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా రామ్ చరణ్ తో ఆడియో కాల్ ద్వారా బాలకృష్ణ మాట్లాడారు.
ఈ ఫోన్ కాల్ లో భాగంగా సంక్రాంతికి ముందు నా సినిమా చూడు ఆ తర్వాత మీ నాన్నగారు సినిమా చూడు అంటూ బాలకృష్ణ సరదాగా రామ్ చరణ్ ను బెదిరించారు.అనంతరం ఈ కార్యక్రమంలో గోపిచంద్ కూడా పాల్గొనగా 2008వ సంవత్సరంలో ఒక హీరోయిన్ తో జరిగిన గొడవ గురించి కూడా ప్రస్తావించారు. మొత్తానికి ఈ ప్రోమో ఎంతో సరదాగా సాగిపోయింది. ఇక ఈ ఎపిసోడ్ కోసం అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…