Bala krishana: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వెండితెరపై పలు చిత్రాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఆహాలో ప్రసారమౌతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు.ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు హాజరు కాగా తాజాగా ఈ కార్యక్రమానికి బల్లాల దేవుడు రానా వచ్చినట్లు తాజాగా ప్రోమోని విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే బాలకృష్ణ రానా మధ్య ఎన్నో సరదా మాటలు సాగాయి. కరోనా సమయంలోవ్యాక్సిన్ గురించి వార్త వస్తుంది అనుకుంటే నీ పెళ్లి వార్త వచ్చింది ఏంటి అంటూ రానాని ఆట పట్టించారు. పెళ్లి అయిన తర్వాత బాగా దారిలోకి వచ్చినట్లు ఉన్నావు పెళ్లికాకముందు పూలరంగడు మాదిరితిరిగే వాడివి ఎంతమందికి హ్యాండ్ ఇచ్చావు ఎంతమందికి నువ్వు నో చెప్పావో గూగుల్ చెబుతుంది అంటూ తనని ఆట పట్టించారు.
ఇక ఈ కార్యక్రమంలో రానా ఏమంటివి.. ఏమంటివి అనే డైలాగ్ చెబుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో రానా బాలకృష్ణ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఈ క్రమంలోనే రానా మీరెప్పుడైనా వసుంధర గారికి లవ్ ప్రపోజ్ చేశారా అని ప్రశ్నించారు. ఇలా రానా ఈ ప్రశ్న అడగడంతో బాలకృష్ణ ఇవన్నీ నీకెందుకయ్యా అంటూ తమాషా చేశారు.
ఇలా రానా అడగడంతో బాలకృష్ణ వెంటనే తన భార్య వసుంధరకి ఫోన్ చేశారు. ఫోన్ చేయడంతోనే వసు ఐ లవ్ యూ అంటూ తనకు లవ్ ప్రపోజ్ చేయడంతో వెంటనే వసుంధర నాకు తెలుసు మీరు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తూనే ఉంటారు అని సమాధానం చెప్పింది. ఇలా వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమను ఈ కార్యక్రమం ద్వారా రానా బయటపెట్టారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇలా వీరి మధ్య సాగిన పూర్తి ఎపిసోడ్ చూడాలంటే జనవరి 7వ తేదీ వరకు వేచి చూడాలి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…