Shanmukh-Deepthi: బిగ్ బాస్ చరిత్రలోనే మొదటిసారి ఇలా..ఎందుకబ్బా..?
Shanmukh-Deepthi: బిగ్ బాస్ పుణ్యమా అని రెండు జంటలు విడిపోయాయి. ఇప్పటికే షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బిగ్ బాస్ చరిత్రలో ఇలా జరగడం మొదటిసారి. గతంలో బిగ్ బాస్ సీజన్లలో చాలా రొమాంటిక్ ఎపిసోడ్స్ జరిగాయి.
అయితే ఇవన్నీ బిగ్ బాస్ షోలో కామన్ గా జరిగేవిగా అందరూ అనుకునే వారు. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా నార్మల్ అయిపోయేవారు. తరువాత వారి రిలేషన్ లోకి మూవ్ అయ్యేవారు. ఇలా బిగ్ బాస్ తరువాత జంటలు బ్రేకప్ చెప్పుకోవడం జరగలేదు.అసలు ఈ మొత్తం ఉదంతానికి కారణం ఎవరా..? అని చూస్తే వినిపించే పేరు సిరి.
బిగ్ బాస్ సీజన్ 5లో సిరి- షణ్ముక్ మధ్య రొమాంటిక్ వ్యవహరమే దీప్తితో రిలేషన్ షిప్ దెబ్బతినడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న సమయంలో సిరి, షన్నూల మధ్య కిస్సింగ్, హగ్గింగ్ సీన్లు రచ్చకు దారి తీశాయి.
వీరిద్దరి మధ్య సంథింగ్.. సంథింగ్ జరుగుతున్నట్లుగా ఆడియన్స్ అనుమానించారు. అయితే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెబుతున్నప్పటికీ.. వీరిద్దరు వ్యవహరించిన తీరును చూస్తే ఎవరైనా ఇది ఫ్రెండ్ షిప్ లా లేదు అని అనుకున్నవాళ్లే ఉన్నారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఈ కౌంగిలింతలను చూసి హద్దులు దాటుతున్నవని హెచ్చిరించింది. అయితే బిగ్ బాస్ హౌజ్ లోనే సిరి – షణ్ముఖ్ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో దీప్తి సునయన షన్నూకు బ్రేకప్ చెప్పినట్లుగా తెలిసింది. న్యూ ఇయర్ కు ముందు ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తమ దారులు వేరని వెల్లడించింది. ఐదేళ్ల రిలేషన్ షిప్ కు బ్రేక్ పడింది. అయితే ఈవిషయంపై సిరి కూడా స్పందించింది. బ్రేకప్ కు నేను కారణం కాదని అంటోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…