Balakrishana: రిపోర్టర్ పై గాడిద అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే!
Balakrishana: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన అంటే చాలామంది భయపడతారు.ఎందుకంటే బాలయ్య బాబుకి కోపం వస్తే ముందు ఎవరున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వారికి గూబ పగిలి పోవాల్సిందే అనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇలా ఎన్నో సార్లు బయటకు వచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానుల పై చేయి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎంతోమంది రిపోర్టర్లు తనని వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ విసిగించినప్పుడు కూడా బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి పై తనదైన శైలిలో పంచ్ వేశారు.
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి అతనికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకొని ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బాలకృష్ణ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలని చెబుతున్న సమయంలో వెంటనే రిపోర్టర్ కలుగజేసుకొని వ్యక్తిగత దూరం కాదు సామాజిక దూరం సార్ అంటూ సమాధానం చెప్పారు. రిపోర్టర్ ఇలా చెప్పేసరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలయ్య సామాజికం కాదు గాడిద వ్యక్తిగతం సామాజికం అంటే ఏమిటి అంటూ తన పై పంచ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు బాలయ్యబాబు మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది లేదంటే రిపోర్టర్ చెంప చెల్లుమనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…