Balakrishna: బాలయ్య టాక్ షో రికార్డ్.. ‘అన్ స్టాపబుల్’ కు బాలయ్య రెమ్యూనరేషన్ లీక్..!
Balakrishna: అఖండ భారీ విజయంతో సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపించాడు. రికార్డ్ కలెక్షన్లు రాబట్టాడు. కరోనా తరువాత.. థియేటర్లు జనాలు వస్తారా.. రారా.. అని సందిగ్థంలో ఉన్న క్రమంలో బాలయ్య మ్యాజిక్ చేశాడు. ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. భారీ విజయాన్ని అఖండకు అందించారు. బోయపాటి మేకింగ్, బాలయ్య నట విశ్వరూపం మొత్తంగా అఖండ రచ్చ చేసింది.
ఇదిలా ఉంటే బాలయ్య ఓటీటీలో కూడా తగ్గేది లే.. అని నిరూపించాడు. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ‘‘ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’’ పెద్ద సక్సెస్ అయింది. తెలుగు టాక్ షోల్లోనే బెస్ట్ గా నిలిచింది. రికార్డ్ వ్యూస్ అందుకుంది. బాలయ్య హోస్ట్ గా అదరగొట్టాడు.
టాక్ షోలో తన ఎనర్జీ పీక్స్. గెస్ట్ లుగా వస్తున్నవారిని తనదైన శైలిలో ఆటాడుకుంటున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ షూటింగ్ పూర్తియినట్లగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ షోకు మోహన్ బాబుతో మొదలు.. రాజమౌళి, శ్రీకాంత్, కీరవాణి, అల్లు అర్జున్, రవితేజ మొదలైనవారు గెస్ట్ లుగా వచ్చారు. తాజాగా చివరి ఎపిసోడ్ కు ఛార్మీ, రౌడీ హీరో విజయ్ దేవరకొండ రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరిపై షూటింగ్ కంప్లీట్ అయింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ షో ఇటీవల మరో రికార్డ్ క్రియేట్ చేసింది. IMDBలోని టాప్ 10 రియాలిటీ టీవీ జాబితాలో ‘అన్ స్టాపబుల్’ స్థానం దక్కిం చుకుంది. ఈ తెలుగు టాక్ షోకి ఇది అరుదైన విజయం. అయితే మొదటి సీజన్ కు బాలయ్యకు రెమ్యునరేషన్ గా ఒక్కో ఎపిసోడ్ కు రూ. 25 లక్షలు ముట్టచెప్పినట్లు సమాచారం. షో విపరీతంగా హిట్ కావడంతో రెండో సీజన్ కు ఎంత ఇస్తారనేది ఆసక్తి రేపుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న సమచారం ప్రకారం రెమ్యునరేషన్ రెట్టింపు చేస్తారని తెలుస్తోంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…