General News

అరటిపండు తొక్కతో పులిపిర్లు మాయం.. ఎలా అంటే?

కాలంతో సంబంధం లేకుండా అన్ని కాలాలలో లభించే పండ్లలో అరటి పండు ఒకటి. అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయనే సంగతి మనకు తెలిసిందే. అరటిపండుని చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతిరోజూ ఒకటి తినడం వల్ల ఎన్నో పోషక విలువలు శరీరానికి అందడమే కాకుండా మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి దోహదపడుతుంది. అయితే చాలామంది అరటి పండును మాత్రమే తిని తొక్కను పక్కన పెట్టేస్తుంటారు.

నిజానికి అరటిపండులో కన్నా తొక్కలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన అరటిపండు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మనలో చాలామంది పులిపిరి సమస్యలతో ఎంతో బాధపడుతుంటారు. అయితే వీటిని తొలగించే క్రమంలో నొప్పి కలగడం వల్ల చాలామంది వీటిని వదిలేస్తుంటారు.

పులిపిరి మొహంపై లేదా ముక్కు పై ఉంటే చూడటానికి ఎంతో అసభ్యంగా ఉంటుంది. కనుక ఈ విధమైన సమస్యతో బాధపడేవారికి అరటిపండు తొక్క ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ విధంగా పులిపిరి సమస్యతో బాధపడేవారు అరటిపండు తొక్క ని తీసుకొని పులిపిరి పై ఉంచి బాండేజ్ వేయాలి.ఈ విధంగా ప్రతి రోజూ చేయడం వల్ల మన మొహం పై ఉన్న పులిపిరి వాటంతట అవే తగ్గిపోతాయి.

అరటిపండు తొక్కలలో ఎక్కువ భాగం యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల అవి మన శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. మన చర్మం పై ఏర్పడిన మచ్చలు, ముడతలను తొలగించడంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలకపాత్ర వహిస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ప్రతి రోజూ ఒక అరగంట పాటు మొహంపై మసాజ్ చేసుకుని, మొహాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago