Bandla Ganesh: బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు అయితే ఈయన కొన్నిసార్లు సమయం సందర్భం లేకుండా చేసేటటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలపై ఇతనిని భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు బండ్ల గణేష్.
నందమూరి తారక రత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చే ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తారకరత్న మరణ వార్తతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు నివాళులు అర్పించడానికి వచ్చారు.ఇక అలేఖ్య రెడ్డి స్వయానా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడంతో విజయసాయిరెడ్డి కూడా ఇక్కడ ఉండి అన్ని తానే చూసుకున్నారు.
తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి మాట్లాడారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని అసలు మాట్లాడను… అవసరం వస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం ఇది.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ పై ఎంతోమంది నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బండ్ల గణేష్ నీ పిచ్చి కూతలు ఆపు అంటూ కొందరు కామెంట్లు చేయగా,వారు కలిసిన సమయం సందర్భం ఏది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఆ మాత్రం సంస్కారం లేదా అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…