Bandla Ganesh: బండ్ల గణేష్ ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా ఎంతో పేరు సంపాదించుకున్నారు అయితే ఈయన కొన్నిసార్లు సమయం సందర్భం లేకుండా చేసేటటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొందరు ఈ వ్యాఖ్యలపై ఇతనిని భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి ట్రోలింగ్ కి గురయ్యారు బండ్ల గణేష్.

నందమూరి తారక రత్న మరణించడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు తరలివచ్చే ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే తారకరత్న మరణ వార్తతో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా తనకు నివాళులు అర్పించడానికి వచ్చారు.ఇక అలేఖ్య రెడ్డి స్వయానా వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డికి సమీప బంధువు కావడంతో విజయసాయిరెడ్డి కూడా ఇక్కడ ఉండి అన్ని తానే చూసుకున్నారు.
తారకరత్నకు నివాళులు అర్పించడానికి వచ్చిన చంద్రబాబు ఆయనకు నివాళులు అర్పించి అనంతరం విజయసాయిరెడ్డితో కలిసి మాట్లాడారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ ఈ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతుంది. నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఇలా కూర్చొని అసలు మాట్లాడను… అవసరం వస్తే అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతా అది నా నైజం.

Bandla Ganesh: బతికితే సింహంలా బతకాలి…
అత్యంత బాధాకరమైన విచిత్రం ఇది.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ ట్వీట్ చేశారు అయితే ఈ ట్వీట్ పై ఎంతోమంది నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు. బండ్ల గణేష్ నీ పిచ్చి కూతలు ఆపు అంటూ కొందరు కామెంట్లు చేయగా,వారు కలిసిన సమయం సందర్భం ఏది నువ్వు మాట్లాడే మాటలు ఏంటి? ఆ మాత్రం సంస్కారం లేదా అంటూ పెద్ద ఎత్తున బండ్ల గణేష్ పై నేటిజన్స్ ఫైర్ అవుతున్నారు.
నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం.
అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి…..!!! pic.twitter.com/ENGbX3oRP5— BANDLA GANESH. (@ganeshbandla) February 20, 2023





























