Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ ఎన్నో విషయాలను వెల్లడించడమే కాకుండా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో బండ్ల గణేష్ త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానంటూ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో న్యూస్ ఛానల్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో బండ్ల గణేష్ ఇంతెత్తున ఫైర్ అయ్యారు.
త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా డబ్బులు వచ్చే చోట, లాభాలు వచ్చే చోట వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పులేదు కదా అంటూ బండ్ల గణేష్ సమాధానం చెప్పారు.అయితే బాగా లాభాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా మరి మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. మీకు చాలా కోపం వస్తున్నట్టుంది అంటూ మరోసారి యాంకర్ మాట్లాడటంతో కోపం రాదా.. కోపం ఇంతే రావాలని ఎక్కడైనా రాసుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పై కూడా ఈయన నోరు విప్పారు.గతంలో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుతిడుతూ ఒక ఆడియో లీక్ అయింది. అయితే గతంలో ఆ వాయిస్ నాది కాదన్న బండ్ల గణేష్ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా ఆ వాయిస్ నాదే నేనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తిట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మొత్తానికి ఆ వీడియో పై స్పందించి బండ్ల గణేష్ నిజం ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…