Categories: FeaturedMovie News

సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి రాజకీయాలు చేయడానికి ఇది సరైన సమయం కాదు: బండ్ల గణేష్

మెగాహీరో సాయిధరమ్ తేజ్ శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి మనకు తెలిసిందే.రోడ్డు ప్రమాదం అనంతరం అపస్మారక స్థితిలోకి వెళ్లిన సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం అపోలో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన స్పృహలోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు సమాచారం. సాయి ధరమ్ తేజ్ కు బైక్ రేసింగ్ అంటే ఎంతో ఇష్టం అనే సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ఎప్పటిలాగే బయటకు వెళ్ళిన సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అయితే సాయి ధరమ్ తేజ్ నటుడు నరేష్ కొడుకు నవీన్ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వీరు తరచూ బైక్ రేసింగ్ లో పాల్గొనేవారు. అయితే శుక్రవారం కూడా నరేష్ ఇంటికి వెళ్లి అక్కడినుంచి బయలుదేరిన తరువాత సాయి తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సాయి తేజ్ ఈ ప్రమాదంపై నరేష్ స్పందిస్తూ నేను ముందుగానే హెచ్చరించాను అంటూ సాయి తేజ్ ప్రమాదంపై స్పందించిన నరేష్ వ్యాఖ్యలకు బండ్లగణేష్ స్పందించి ట్విట్టర్ ద్వారా వీడియోను షేర్ చేశారు.

ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సాయి ధరమ్ తేజ్ కి చిన్న ప్రమాదం జరిగింది ఎప్పటిలాగే ఆయన షూటింగ్లకు వెళ్తారు సినిమాలు తీస్తారు అంతా బాగుంటుంది. ఇలాంటి సమయంలో నటుడు నరేష్ గారూ మీరు ఎవరెవరో ప్రమాదంలో మరణించిన వారి పేర్లు చెప్పడం, వారి గురించి ఈ సమయంలో మాట్లాడటం కరెక్ట్ కాదు. అనవసరంగా సాయి ధరంతేజ్ రేసింగ్ చేశారని మా ఇంటి దగ్గరికి వచ్చారని ఇవన్నీ చెప్పడం తప్పు కదా సర్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ ఘాటుగా స్పందించారు.

ఇలాంటి క్లిష్ట సమయాలలో కేవలం ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి త్వరగా కోలుకోవాలని, సాయి ధరమ్ తేజ్ మునుపటిలాగే సంతోషంగా ఉండాలని కోరుకోవాలి తప్ప ఇలాంటి సమయంలో ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎప్పుడు ఎలా మాట్లాడాలి ముందు నేర్చుకోండి సార్ అంటూ నరేష్ వ్యాఖ్యలపై బండ్లగణేష్ స్పందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago