Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!
Crime News: బడా బాబుల్లా విమానాల్లో వస్తారు… సైకిల్ పై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.. ఆతరువాత ఇళ్లును గుల్ల చేస్తారు. ఆ తరువాత రైల్లో సొంతూళ్లకు చెక్కెస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడే ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దొంగలముఠా ఆటకట్టించారు.
ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసి ఊచల వెనక్కి పంపారు. వారి వద్ద నుంచి సైకిల్, 520 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, రూ. 91 వేలను సహా.. మొత్తం రూ. 27.16 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎఫ్బీఐ కాలనీకి చెందిన రైటర్డ్ వీఆర్వో లక్ష్మీనరసింహ రావు గతేడాది డిసెంబర్ 18న కుటుంబంతో షాపింగ్ కు వెళ్లాడు.
అలా వెళ్లి వచ్చే వరకు ఇంటిని దొంగలు దోచేశారు. ఇంటి వెనకాల ఉన్న డోర్ తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు బీరువాను, అల్మారాను పగలకొట్టి 30 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
సీసీ పుటేజ్ ఆధారంగా దొంగలిద్దరు సాహెబ్ నగర్ లో ఓ రూంలో అద్దెకు ఉన్నట్లుగా తేల్చారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా… చోరీ చేసిన దొంగల్ని గుర్తించారు. గతంలో కూడా ఈ ముఠా సూర్యాపేటలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 4న మళ్లీ చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. దొంగల్ని పశ్చిమ బెంగాల్ ముషీరాబాద్, కోల్ కతాలకు చెందిన రఫికుల్ ఖాన్, షేక్ సూరజ్ లుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో వీరిపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. దోచుకున్న సొమ్మును ముషీరాబాద్ కు చెందిన అనిత్ సీతారాం బండగర్, నోబిన్ అనే వ్యక్తులకు అమ్మేసేవారిని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…