Akhanda Movie: ఆ ప్రాంతంలో అఖండ సినిమా కలెక్షన్లను బ్రేక్ చేయలేకపోయిన భీమ్లా, పుష్ప, ఆర్ఆర్ఆర్..ఎక్కడంటే?
Akhanda Movie: గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అన్ని రంగాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. ముఖ్యంగా వైరస్ ప్రభావం చిత్రపరిశ్రమకు కూడా భారీ నష్టాలను తీసుకు వచ్చిందని చెప్పాలి. అయితే కరోనా వైరస్ కారణంగా ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు నోచుకోలేక వాయిదా పడుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా వైరస్ కారణంగా విడుదలకు వెనకాడరు.
ఇలాంటి సమయంలోనే బాలకృష్ణ ఎంతో ధైర్యం చేసి అఖండ సినిమాను విడుదల చేశారు. అయితే ఈ సినిమా విడుదలైన సమయంలో ఒకవైపు కరోనా వైరస్ వెంటాడుతూ ఉండగా మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ బాలకృష్ణ అఖండ సినిమా విడుదల అయ్యి తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో ధైర్యం నింపింది అని చెప్పాలి.
కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఎవరైనా థియేటర్లకు వస్తారా? రారా అన్న అనుమానంతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అఖండమైన విజయాన్ని అందుకొని మిగతా సినిమాలకు ధైర్యం నింపింది. అఖండ విడుదలైన తర్వాత అల్లు అర్జున్ పుష్ప, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్, నాగార్జున బంగార్రాజు, రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఈ సినిమాలన్నీ మంచి కలెక్షన్లను కూడా రాబట్టాయి.
ఇలా వరుసగా విడుదలైన ఈ సినిమాలలో ఏ సినిమా మంచి విజయం సాధించిందనే విషయానికి వస్తే బాలకృష్ణ నటించిన అఖండ సినిమా అంటూ డిస్ట్రిబ్యూటర్లు బల్లగుద్ది చెబుతున్నారు.ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ గోదావరి జిల్లాలోని ఒక థియేటర్లో అఖండ సినిమా విడుదలైంది. ఇదే థియేటర్లోనే పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్, బంగార్రాజు, పుష్ప, రాధే శ్యామ్, త్రిబుల్ ఆర్ సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఒక్క అఖండ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ కూడా డిస్ట్రిబ్యూటర్లకు లక్షలలో నష్టాన్ని తీసుకువచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మిగిలిన సినిమాల కన్నా అఖండ హిట్ కొట్టిందని డిస్ట్రిబ్యూటర్ లో తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…