Big Boss Neha Chowdary : బిగ్ బాస్ తెలుగులో మొదటి రియాలిటీ షో సీజన్ 6 మొదలై అపుడే ఎలిమినేషన్లు, గొడవలు అంటూ సాగుతోంది. బిగ్ బాస్ కొత్త సీజన్ ఎపిసోడ్స్ ప్రస్తుతం రేటింగ్స్ లేక విలవిలలాడుతోంది. షోలో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ సరిగా లేక చప్పగా ఉన్నాయి ఎపిసోడ్స్. అయితే ఇపుడిపుడే ఇంట్రెస్ట్ పెంచుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్లు, టాస్క్ ఆడేటపుడు గొడవలు, బూతులు తిట్టుకోవడం అన్ని మొదలై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పుట్టిస్తున్నాయి.ఇక వరుసగా మూడో కంటెస్టెంట్ గా నేహా చౌదరి ఎలిమినేట్ అయి అందరికి షాక్ ఇచ్చింది.
కౌశల్ ఇంటర్వ్యూ లో నేహా…
నేహా పెరఫార్మెన్స్ లాస్ట్ వీక్ హౌస్ లో పెద్దగా ఏమి లేదు. ఇక టాస్క్ లో కూడా ఎప్పటి లాగా పాల్గొనలేదు. ఇక బయట ఆడియన్స్ ని తన ఆటతో ఏ మాత్రం ఆకట్టుకోలేక పోయింది. క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా వంటి వారు నేహా కు ఓటు చేయమన్న ఫలితం లేకుండా పోయింది. ఇక బయటికి వచ్చాక అందరిలాగానే నేహా కూడా తన ఎలిమినేషన్ కరెక్ట్ కాదంటూ లెక్చర్ ఇచ్చింది. ఇక పలు యూట్యూబ్ ఛానెల్స్ లో ఇంటర్వ్యూ లో పాల్గొంటున్న నేహా బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మండా యూట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొనింది.
ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ నుండి అభినయ శ్రీ, షాని సాల్మన్ వంటివారు ఎలిమినేట్ అయిన వారిని ఇంటర్వ్యూ చేయని కౌశల్ నేహా ను మాత్రం ఇంటర్వ్యూ చేయడంతో నెటిజన్స్ నేహా మాత్రమే ఎందుకంత స్పెషల్ కౌశల్ అంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా మంది కంటెస్టెంట్స్ లాగా కౌశల్ కూడా బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రకరకాల వీడియోలు చేస్తూ బిగ్ బాస్ గురించి కూడా వీడియోలు చేస్తున్నాడు. అయితే సీజన్ 6 లో మాత్రం మొదటి సారి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్ నేహా ను ఇంటర్వ్యూ చేసాడు. ఇక నేహా హౌస్ లో ఉన్న వారి గురించి కామెంట్స్ చేస్తూ తన ఎలిమినేషన్ రాంగ్ అంటూ చెప్పుకోచ్చింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఓ సాధారణ రైతు తన అచంచల భక్తితో అసాధారణ సృష్టికి రూపమిచ్చాడు. నిత్యజీవితంలో వ్యవసాయం చేస్తూ…
భారతీయ సంస్కృతిలో పలకరింపు అంటే కేవలం మాటల మార్పిడి కాదు.. అది మన విలువలు, వినయం, పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించే…
ప్రతిరోజూ ఉదయం లేవగానే స్నానం చేయడం మన దైనందిన జీవితంలో భాగమే. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా, మనసుకు తేలికగా…
వైవాహిక జీవితంలో ఆనందం, ఆయుష్షు, ఐశ్వర్యం కోరుకునే మహిళలు భక్తిశ్రద్ధలతో ఆచరించే వ్రతాలలో వట సావిత్రి వ్రతం ఒకటి. సావిత్రి…
వేసవి కాలం రాగానే మార్కెట్లలో కనిపించే నల్లటి నేరేడు పండ్లు చాలా మందిని ఆకర్షిస్తాయి. రుచికరంగా ఉండే ఈ పండు…
హిందూ పురాణాల్లో సతీదేవి, పరమశివుడు, దక్షుడి యజ్ఞం చుట్టూ తిరిగే కథనం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ గాథలో దాగి…