Breaking News

BIG BREAKING..ఆపరేషన్ ట్రాషి-I సక్సెస్.. జమ్మూ కాశ్మీర్‌లో అస్సలు ఏం జరిగింది..

జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఘోర ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. చత్రూ అడవీ ప్రాంతంలో నక్కిన వారిని తుదముట్టించడానికి ఇండియన్ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, CRPF బలగాలు సంయుక్తంగా చేపట్టిన ‘ఆపరేషన్ ట్రాషి-I’ సక్సెస్‌గా ముగిసింది. భద్రతా బలగాలు పరిసర ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తూ, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసి, అటవీ భద్రతను పెంచారు.

ఇంటెలిజెన్స్ సమాచారానికి అనుగుణంగా, సైన్యం చత్రూ బెల్ట్‌లోని దట్టమైన అడవీ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. ఉదయం 11 గంటలకు భద్రతా బలగాలు గాలింపు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ప్రతిఘటనగా ఎదురుకాల్పులు జరిపారు.

ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మరణించారు. భద్రతా వర్గాలు ఒకరు జైషే మహమ్మద్ మోస్ట్ వాంటెడ్ కమాండర్ సైఫుల్లా అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. సైఫుల్లా గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో భద్రతా బలగాలపై దాడులు నిర్వహిస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నాడని తెలిపారు. ఘటన స్థలంలో రెండు AK-47 రైఫిల్స్, భారీగా పేలుడు పదార్థాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం అయ్యింది.

కిష్త్వార్ అటవీ ప్రాంతంలో ఈ ఏడాది ప్రారంభం నుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. జనవరి 18న జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక పారా కమాండో వీరమరణం పొందగా, ఎనిమిది మంది సైనికులు గాయపడ్డారు. మంచు కురుస్తున్న, క్లిష్ట భౌగోళిక పరిస్థితుల మధ్య కొనసాగిన ‘ఆపరేషన్ ట్రాషి-I’ తాజా విజయంతో స్థానిక ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు అధికారులు వెల్లడించారు.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago