తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ ఫైవ్ షో రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీనితో వీక్షకులు ప్రతి ఒక్క ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. టాస్క్ లో భాగంగా గొడవ పడడం, వెంటనే కలిసిపోవడం లాంటివి చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్స్.
ఇది ఇలా ఉంటే ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో పది మంది సభ్యులు నామినేట్ అయ్యారు. కెప్టెన్ షన్ను మినహా మిగిలిన అందరూ నామినేషన్ లోకి వచ్చారు. అయితే బిగ్ బాస్ తాజాగా వీరికి ఒక అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. ఈ నామినేషన్స్ నుంచి ఒకరు తప్పించుకునే అవకాశం కల్పించాడు. బ్యాగేజ్ జోన్,డేంజర్ జోన్, సేఫ్ జోన్ అంటూ మూడు భాగాలుంటాయి.
టాస్క్ లో గార్డెన్ ఏరియాలో ఒక సేఫ్ జోన్ డోర్ లోకి తమ ఫోటో కాకుండా మిగిలిన కుటుంబ సభ్యులు ఫోటోలు ఉన్న భాగాలు తీసుకొని పరిగెత్తాలి.ఇలా వెళ్లే క్రమంలో ఎవరు అయితే చివరగా సేఫ్ జోన్ లోకి వెళ్ళ్తారో, అతడితో పాటు అతని చేతిలో ఎవరి ఫొటో ఉన్న బ్యాగ్ ఉందో ఆ ఇద్దరు డేంజర్ జోన్ కి వెళ్తారు. ఈ గేమ్ లో కాజల్,శ్రీరామ్ తొలిరౌండ్ లోనే డేంజర్ జోన్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
కాజల్ ఫోటో ఉన్న బ్యాగు తీసుకున్న శ్రీరామ్ చంద్ర ముందుగా గార్డెన్ లోకి వచ్చినప్పటికీ కావాలనే సేఫ్ జోన్ లోకి వెళ్లన్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో అని మాస్టర్ విన్ అయింది. గత వారం అని మాస్టర్ కు వచ్చిన పవర్ ను వాడే సమయం వచ్చిందని తెలిపారు బిగ్ బాస్. దీంతో ఒకరిని నామినేషన్ నుంచి తప్పించవచ్చని చెప్పగా అనీ మాస్టర్ మానస్ ను నామినేషన్స్ నుంచి తప్పించింది. అలా ఆ ఇద్దరు బయట పడ్డారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…