బిగ్ బాస్ సీజన్ 5 లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 10 వ వారం కాజల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నా.. చివరిగా అనారోగ్యం కారణంగా జెస్సీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. వారం పాటు సీక్రెట్ రూంలో ఉంచి అతడికి చికిత్స అందించారు బిగ్ బాస్ నిర్వాహకులు.
అయితే అతడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అతడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి నాగార్జున దగ్గరకు వచ్చాడు. దీంతో అతడు హౌస్ మేట్స్ గురించి ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పగానే.. ప్రతీ ఒక్కరితో అతడు ఫోన్లో మాట్లాడాడు.
తప్పులు, ఒప్పుల గురించి మాట్లాడుతూ.. కొంతమందిని హెచ్చరించాడు కూడా. ముందుగా అతడు సన్నీకి ఫోన్ చేస్తాడు. నీ ఆట నువ్వు ఆడు ఎవరినీ నమ్మకు బ్రో అంటూ.. సలహా ఇస్తాడు. బీబీ హోటల్లో బాగా ఆడావు అంటూ కితాబిస్తాడు.
తర్వాత మానస్ తో కూడా.. తప్పుఒప్పుల గురించి మాట్లాడి.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఇలా హౌస్ లో ఉన్న 9 మందితో మాట్లాడుతాడు. చివరగా షణ్ముఖ్ తో మాట్లాడిన అతడు.. కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. అతడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. టాప్ లో ఉండే ఐదుగురు పేర్లను చెప్పేశాడు. సిరి, షణ్ముఖ్, రవి, శ్రీరామ్ అండ్ సన్నీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇక చివరగా హౌస్ వదిలి వెళ్లేముందు అతడు ఎంతో బాధపడుతూ నాగార్జునకు హగ్ ఇచ్చి.. హౌస్ మేట్స్ కు బై చెప్పేసి వెళ్తాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…