Featured

టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ లు ఎవరో చెప్పేసిన జెస్సీ..!

బిగ్ బాస్ సీజన్ 5 లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 10 వ వారం కాజల్ ఎలిమినేట్ అవుతుందని అందరూ అనుకున్నా.. చివరిగా అనారోగ్యం కారణంగా జెస్సీ ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. వారం పాటు సీక్రెట్ రూంలో ఉంచి అతడికి చికిత్స అందించారు బిగ్ బాస్ నిర్వాహకులు.

అయితే అతడి ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో అతడు హౌస్ నుంచి ఎలిమినేట్ అయి నాగార్జున దగ్గరకు వచ్చాడు. దీంతో అతడు హౌస్ మేట్స్ గురించి ఫోన్లో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పగానే.. ప్రతీ ఒక్కరితో అతడు ఫోన్లో మాట్లాడాడు.

తప్పులు, ఒప్పుల గురించి మాట్లాడుతూ.. కొంతమందిని హెచ్చరించాడు కూడా. ముందుగా అతడు సన్నీకి ఫోన్ చేస్తాడు. నీ ఆట నువ్వు ఆడు ఎవరినీ నమ్మకు బ్రో అంటూ.. సలహా ఇస్తాడు. బీబీ హోటల్లో బాగా ఆడావు అంటూ కితాబిస్తాడు.

తర్వాత మానస్ తో కూడా.. తప్పుఒప్పుల గురించి మాట్లాడి.. విలువైన సలహాలు, సూచనలు ఇస్తాడు. ఇలా హౌస్ లో ఉన్న 9 మందితో మాట్లాడుతాడు. చివరగా షణ్ముఖ్ తో మాట్లాడిన అతడు.. కొంత భావోద్వేగానికి గురైనట్లు కనిపించింది. అతడు మాట్లాడిన మాటలను బట్టి చూస్తే.. టాప్ లో ఉండే ఐదుగురు పేర్లను చెప్పేశాడు. సిరి, షణ్ముఖ్, రవి, శ్రీరామ్ అండ్ సన్నీ అంటూ చెప్పకనే చెప్పేశాడు. ఇక చివరగా హౌస్ వదిలి వెళ్లేముందు అతడు ఎంతో బాధపడుతూ నాగార్జునకు హగ్ ఇచ్చి.. హౌస్ మేట్స్ కు బై చెప్పేసి వెళ్తాడు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఈ రోజు రాశి ఫలాలు.. వృశ్చిక రాశికి శుభసూచనలు, మిగతావారికి హెచ్చరికలు!

2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…

30 minutes ago

శని బాధలకు ఉపశమనం.. గుజరాత్‌లోని ఈ హనుమ ఆలయం ఎందుకు ప్రత్యేకం?

గుజరాత్‌లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…

60 minutes ago

విదేశీ ఉద్యోగం అంటూ వల.. యువత మోసపోయిన కథ

విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్‌ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…

10 hours ago

బుక్ చేసినా రాని సిలిండర్లు.. చివరకు బలవంతంగా తీసుకెళ్లిన ప్రజలు

మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…

11 hours ago

మోదీకి రేవంత్ లేఖ.. నియోజకవర్గాల పెంపుపై కీలక డిమాండ్లు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…

11 hours ago

“ఆమె నాకు కూతురు లాంటిది”.. హీరోయిన్‌కు నో చెప్పిన వేణు..!

సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…

11 hours ago