Bigg Boss6: బుల్లితెర పై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం రోజురోజుకు ప్రేక్షకులను పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా బిగ్ బాస్ నిర్వహించే టాస్కులతో ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతూ వారి జీవితంలో జరిగిన సంఘటనలను తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ రెండవ వారంలో భాగంగా సిసింద్రీ టాస్క్ పూర్తి కాగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఒక బేబీ ఉండటం అది వారి జీవితాన్ని ఎలా మార్చిందనే విషయాల గురించి తెలపాలని సూచించారు.
ఈ క్రమంలోనే సుదీప 2015లో తనకు ఒకసారి ప్రెగ్నెన్సీ కన్సివ్ అయిందని థైరాయిడ్ కారణంగా బేబీని వదులుకోవాల్సి వచ్చిందంటూ ఎమోషనల్ అయ్యారు.అదేవిధంగా రేవంత్ మాట్లాడుతూ చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు అయితే ప్రస్తుతం తన భార్య సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ ఎప్పుడు నాన్న అని పిలిపించుకుంటానా అని ఎదురు చూస్తున్నానని తెలిపారు.
ఇక మెరీనా రోహిత్ దంపతులు కూడా తమ బేబీని కోల్పోయిన సంఘటన గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యారు.త్రీ మంత్స్ తర్వాత బేబీ హార్ట్ బీట్ లేదని చెప్పగా వేరే దారి లేక బేబీనీ కోల్పోయామని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక కీర్తి భట్ సైతం బిగ్ బాస్ వచ్చేముందు తన కూతురు లేదని వార్త తెలిసింది అయితే చివరి చూపుకు కూడా నోచుకోలేకపోయానంటూ ఎమోషనల్ అయ్యారు.
అందరిని ఎప్పుడు నవ్విస్తూ ఉండేటటువంటి చలాకి చంటి జీవితంలో కూడా విషాద ఘటన ఉంది. తాను చూస్తుండగానే తన తల్లి ఫైర్ యాక్సిడెంట్ లో చనిపోయిందని ఒక్కడినే దాదాపు రెండు గంటల పాటు ఏడుస్తూ ఉన్నాను. ఇలా నా తల్లి చనిపోతే నా జీవితంలోకి ఇద్దరు అమ్మలు వచ్చారంటూ ఈయన తన తల్లి మరణం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో జరిగిన సంఘటనలను చెప్పడంతో మిగిలిన కంటెస్టెంట్లు కూడా ఎంతో ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…