Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై త్వరలోనే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.ఈ కార్యక్రమం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటికే మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేశారని తెలుస్తుంది. ఇక ఎప్పటిలాగే ఈ కార్యక్రమానికి నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఇలా ఈ కార్యక్రమం త్వరలోనే ప్రసారం కానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం గురించి ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కూడా ఎప్పటిలాగే కపుల్స్ వెళ్లబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే ఆ జంట ఎవరు అంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే అమర్ తేజు పేర్లు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా మరో కపుల్ పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
ప్రముఖ డాన్స్ మాస్టర్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి ఆట సందీప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో ఈయన తన భార్య జ్యోతితో కలిసి పెద్ద ఎత్తున డాన్స్ రీల్స్ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా తమ డాన్స్ పెర్ఫార్మెన్స్ ద్వారా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి ఆట సందీప్ మాస్టర్ అలాగే జ్యోతి బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారని సమాచారం.
ఇలా వీరిద్దరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారంటూ ఓ వార్త సంచలనంగా మారింది.ప్రస్తుతం ఈ జంట స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి నీతోనే డాన్స్ అనే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే ఈ జోడి బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా కూడా హాజరు కాబోతున్నారనే విషయం వైరల్ గా మారింది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…