Bigg Boss7:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తెలుగులో ఇప్పటికీ ఆరు సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఏడవ సీజన్ కి సంబంధించి వరుస ప్రోమోలను విడుదల చేస్తూ ఈ షోపై భారీగానే అంచనాలను పెంచేశారు. అందరూ అనుకున్నట్టు ఈసారి ఈ కార్యక్రమం ఉండబోతుందని ఈసారి సరికొత్త రూల్స్ సరికొత్త గేమ్స్ అంటూ నాగార్జున ఈ కార్యక్రమం పై భారీ అంచనాలు పెంచేలా చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి మరొక ప్రోమో విడుదల చేశారు.
ది ఎండ్ అంటూ నాగార్జున మరొక కొత్త ప్రోమో ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇందులో భాగంగా ఓ వ్యక్తి కొండ నుంచి పడబోతూ ఉండగా తన ప్రియురాలు దుపట్టా ఇచ్చి తనని కాపాడుతుంది. ఇంతలోనే తనకు తుమ్ము రావడంతో దుపట్టా వదిలేస్తుంది అప్పుడు నాగార్జున ది అండ్ ఇలాంటి క్లైమాక్స్ లు మనం బోలెడు చూసాం అయితే ఈసారి సరికొత్తగా అంటూ ఇది అంతం కాదు ఆరంభం అంటూ బిగ్ బాస్ 7 గురించి తాజాగా విడుదలైన ఈ ప్రోమో మరిన్ని అంచనాలను పెంచేస్తుంది.
ఇక ఈ కార్యక్రమం అతి త్వరలోనే ప్రసారం కాబోతుందని ఇప్పటికే ఈ కార్యక్రమంలో పాల్గొనబోయే కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని తెలుస్తుంది. అయితే ఈసారి ప్రేక్షకులకు పరిచయం లేనటువంటి మొహాలు కాకుండా బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి వారిని హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.ఇప్పటికే బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనబోయే కాంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొందరి పేర్లు వినబడుతున్నాయి.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…