Bigg Boss 7: తెలుగు బుల్లితెరపై అత్యధిక ఆదరణ సంపాదించుకున్నటువంటి అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం అన్ని భాషలలోనూ ప్రసారమవుతా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఈ క్రమంలోని తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లను పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం త్వరలోనే ఏడవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోలను కూడా విడుదల చేస్తూ ఈ కార్యక్రమం పై భారీ అంచనాలను పెంచారు. అయితే నాగార్జున ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈసారి కార్యక్రమం సరికొత్తగా ఉండబోతుందని తెలియజేశారు అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో కూడా మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారని మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి సెలబ్రిటీలను హౌస్ లోకి పంపించబోతున్నారని తెలుస్తోంది.
ఇలా ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పాల్గొన్న పోయే కంటెస్టెంట్ల గురించి ఎన్నో వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా బిగ్ బాస్ కార్యక్రమంలోకి ప్రముఖ బుల్లితెర నటుడు పాల్గొనబోతున్నారని తెలుస్తుంది జెమినీ టీవీలో ప్రసారమైనటువంటి మొగలిరేకులు సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ సీరియల్ లో సాగర్ ఆర్కే నాయుడు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.
చాలామంది ఆర్కే నాయుడుని చూడడం కోసమే ఈ సీరియల్ చూసేవారు అంటే అతిశయోక్తి కాదు అంతలా ఈయన అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే సాగర్ మాత్రం తిరిగి బుల్లితెరపై కాకుండా వెండి తెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం వెండితెరపై పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా ఆదరణ మాత్రం రాలేదు. అయితే ఈయనకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడంతో ఈ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఈయనకు వారానికి లక్షల్లో రెమ్యూనరేషన్ అందించబోతున్నట్లు సమాచారం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…