Rajamouli: రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు పొందడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకున్నారు.
ఇప్పటివరకు మన ఇండియన్ సినిమాకు ఆస్కార్ అవార్డు అంటేనే ఏంటో తెలియదు అలాంటిది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన ఒక సినిమా ఆస్కార్ గెలుచుకొనే స్థాయికి తెలుగు సినిమాని జక్కన్న తీసుకువెళ్లారని చెప్పాలి. అయితే ఇలాంటి ఒక స్టార్ డైరెక్టర్ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత సి కళ్యాణ్ రాజమౌళి గురించి మాట్లాడుతూ…ఒక డైరెక్టర్ సినిమాలు చేయాలి అంటే ప్రేక్షకుల నాడి బాగా తెలిసి ఉండాలని తెలిపారు.ఇలా ఎప్పుడైతే ప్రేక్షకుల నాడి తెలిసి ఉంటుందో అప్పుడే సినిమా హిట్ అవుతుందని తెలిపారు. ఇక రాజమౌళి ప్రతి సినిమా హిట్ అందుకుంటున్నారు అంటే అందుకు కారణం ఈయన స్టార్ హీరోలతో సినిమా చేయడమేనని ఈయన తెలిపారు.
ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి…స్టార్ హీరోలతో సినిమా చేస్తే ఎవరైనా హిట్ సినిమాని అందుకుంటారు అంటూ ఈ సందర్భంగా రాజమౌళి గురించి సి కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ సంచలనంగా మారాయి. ఇక రాజమౌళి సినిమాల విషయానికి వస్తే త్రిబుల్ ఆర్ సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి త్వరలోనే మహేష్ బాబుతో మరో అడ్వెంచర్స్ మూవీ చేయబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా పనులలో రాజమౌళి బిజీగా ఉన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…