Bigg Boss 7: బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇప్పటికే తెలుగులో ఈ కార్యక్రమం 6 సీజన్లను పూర్తిచేసుకుని ఏడవ సీజన్ ప్రసారం అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ఈ సీజన్ గురించి తరచూ ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది మునుపటిలా కాకుండా ఈ సీజన్ మరింత ఎంటర్టైనింగ్ గా నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కార్యక్రమంలోకి యాంకర్ రష్మీ వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కార్యక్రమం గురించి మరో వార్త వైరల్ గా మారింది. గత కొన్ని సీజన్లో నుంచి బిగ్ బాస్ కార్యక్రమంలోకి సెలబ్రిటీ కపుల్స్ నుపంపిస్తున్న విషయం మనకు తెలిసిందే అయితే ఈసారి మాత్రం అందుకు కాస్త భిన్నంగా మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఈసారి సెలబ్రెటీ కపుల్స్ కాకుండా మాజీ సెలబ్రిటీ కపుల్స్ ను పంపించాలనే ఆలోచనలో బిగ్ బాస్ ఉన్నట్టు సమాచారం. సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నోయల్ నటి ఎస్తర్ నుప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే అయితే పెళ్లయిన కొన్ని నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన ఈ జంటను ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లోకి పంపించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట.
ఇక నోయల్ విడాకులు ఆయన వెంటనే బిగ్ బాస్ కార్యక్రమంలోకి వెళ్లిన విషయం మనకు తెలిసిందే. అయితే సీజన్ సెవెన్ లో మరోసారి ఈ మాజీ దంపతులను పంపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఇదే కనుక నిజమైతే ఇందుకు నోయల్ ఎస్తర్ ఒప్పుకుంటారా అనే సందేహాలు కూడా వెలబడుతున్నాయి మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…