Shobha Shetty: బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమంలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నటువంటి వారిలో బుల్లితెర నటులు అమర్ దీప్ చౌదరి, శోభా శెట్టి వంటి వారు ఒకరు. వీరంతా బుల్లితెర సీరియల్స్ నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బిగ్ బాస్ కార్యక్రమం అయిన తర్వాత వీరందరూ కలిసి బిబి ఉత్సవ్ అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలవుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా శోభ శెట్టి తాజాగా అమర్ ను సర్ప్రైజ్ చేసింది స్టార్ హీరో తనకు ఇచ్చినటువంటి విలువైన కానుకను అమర్ కు ఇవ్వటం విశేషం. బిగ్ బాస్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలో హోస్ట్ నాగార్జున వేసుకున్నటువంటి ఒక షర్ట్ పట్ల శోభ ముచ్చట పడింది. మీ టీ షర్ట్ చాలా బాగుంది నాకు ఇవ్వండి సార్ అంటూ అడిగేసింది.
శోభ అలా అడగటంతో నాగార్జున టీషర్ట్ షో పూర్తి కాగానే తనకు ఇచ్చేశారు. ఇక ఈమె కూడా ఆ టీషర్ట్ ధరించి ఫోటో షూట్ చేయించుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే మరొక ఎపిసోడ్లో అమర్ కూడా మీ టీషర్ట్ చాలా బాగుంది సార్ అని చెప్పగా నువ్వు ముందు కూర్చో అంటూ తన టీ షర్ట్ ఇవ్వడానికి నాగార్జున ఇష్టపడలేదు.
సంతోషపడిన అమర్…
ఈ క్రమంలోనే శోభా శెట్టి అమర్ ను అడిగినందుకుగాను నాగార్జున తనకు ఇచ్చిన ఆ టీ షర్ట్ తీసుకెళ్లి అమర్ కి ఇచ్చింది. ఇది నాకెంతో విలువైనది కానీ నువ్వు నాగార్జున సార్ ని అడిగావు కనుక నీకోసం ఇస్తున్నాను అంటూ తనకు ఇవ్వడంతో అమర్ ఎంతో సంతోషపడ్డారు. వేదిక పైనే అమర్ ఆ టీ షర్టు వేసుకొని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…