Shivaji: బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేసినటువంటి వారిలో నటుడు శివాజీ ఒకరు ఈయన బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరమైనటువంటి శివ మరోసారి బిగ్ బాస్ ద్వారా వెలుగులోకి వచ్చారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా ఈయన మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
బిగ్ బాస్ కార్యక్రమంలో టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచినటువంటి శివాజీ మరో వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ వెబ్ సిరీస్ కూడా మంచి హిట్ కావడంతో ఈయన వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయనకు రాజకీయాల గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఇక రాజకీయాల గురించి ఈయనకు ప్రశ్నలు ఎదురు కావడంతో ఒక్కసారిగా ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడటం వేస్ట్ ఒక్కో పార్టీకి ఒక్కో అభ్యర్థి మద్దతు తెలుపుతున్నారని ఈయన వెల్లడించారు. ప్రజలకు ప్రభుత్వం 100 రూపాయల ఖర్చు చేస్తుంది అంటే 200 వాళ్ల నుంచి తీసుకుంటుందని ఈయన వెల్లడించారు.
ఆ హక్కు మీకు లేదు..
ప్రజల డబ్బు గురించి రాజకీయ నాయకులు అసలు ఆలోచించరని తెలిపారు.ప్రస్తుత సమాజం బాగోలేదు. ప్రభుత్వం బాగోలేదు అనే హక్కు మీకు ఎక్కడ ఉందిరా పనికిమాలినోళ్ళారా జనాలకు కాస్తయినా సిగ్గుండాలి. అంటూ శివాజీ ప్రజల ఆలోచనల పై సీరియస్ అయ్యారు. మొత్తానికి రాజకీయాల గురించి శివాజీ మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…
లోక్సభలో కీలకమైన రాజ్యాంగ సవరణ బిల్లు విఫలమవడం దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ఎంతో…
క్రీడా ప్రపంచంలో తన ప్రతిభతో ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సంజూ శాంసన్, ఇప్పుడు సోషల్ మీడియాలోనూ మరో కీలక…
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్తో తన…
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…