Movie News

Bigg Boss: పల్లవి ప్రశాంత్ అరెస్ట్… షాకింగ్ డెసిషన్ తీసుకున్న బిగ్ బాస్ నిర్వాహకులు?

Bigg Boss : బుల్లితెర రియాలిటీ షోగా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నటువంటి కార్యక్రమాలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి. ఈ షో అన్ని భాషల్లో ప్రసారమవుతున్న సంగతి తెలిసినదే. ఇక ఈ షో తెలుగులో 7 సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడవ సీజన్లో భాగంగా కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ గెలుపొందిన విషయం అందరికీ తెలిసిందే.

ఇక ఈ సీజన్ గ్రాండ్ ఫినాలేరోజు పెద్ద ఎత్తున పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ అభిమానుల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.ఈ గొడవలో భాగంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నటువంటి కారుపై రాళ్ల దాడి చేశారు. దీంతో ఇది కాస్త పెద్ద ఎత్తున వివాదంగా మారింది. ఇలా ఈ విషయం వివాదంగా మారటమే కాకుండా పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఇక ఈ అల్లర్లకు పాల్పడినటువంటి వారిని సిసి కెమెరాలు ఆధారంగా పోలీసులు గుర్తించి వారిపై కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ ఈ స్థాయిలో గొడవలకు కారణం కావడంతో బిగ్ బాస్ నిర్వాహకులు ఈ కార్యక్రమం పట్ల షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని కంటెస్టెంట్లు బయటకు వచ్చే సమయంలో పెద్ద ఎత్తున ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ర్యాలీలు నిర్వహించకూడదు…

ఇలా ఇకపై ర్యాలీలు చేయకుండా వారిని కంటెస్టెంట్లుగా ఎంపిక చేసుకునే సమయంలోనే అగ్రిమెంట్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారట కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాలలో ఎవరు కూడా ర్యాలీ చేయకూడదని వారు హౌస్ లోకి వచ్చేటప్పుడు ఎలా గుట్టు చప్పుడు కాకుండా వస్తారో బయటకు వెళ్లేటప్పుడు కూడా అలాగే వెళ్లాలి అంటూ నిబంధనలను పెట్టబోతున్నారని తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రోజూ ఒక గ్లాస్ సత్తు… శరీరంలో అద్భుత మార్పులు!

మారుతున్న జీవనశైలిలో ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న వేళ, ఖరీదైన ఎనర్జీ డ్రింక్స్‌కి ప్రత్యామ్నాయంగా సంప్రదాయ పానీయాలపై మళ్లీ దృష్టి పడుతోంది.…

15 minutes ago

వేసవిలో కుండ నీళ్లు తాగుతున్నారా? ఈ తప్పులు చేస్తే ప్రమాదం!

వేసవి తాపానికి సహజ చల్లదనం అందించే మట్టి కుండలు… ఆరోగ్యానికి మేలు చేసే ఈ సంప్రదాయ విధానంలో జాగ్రత్తలు తప్పనిసరి…

56 minutes ago

రాజధాని నిర్మాణంపై స్పష్టత… వెనక్కి తగ్గేది లేదన్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మాటల యుద్ధం వేడెక్కింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్…

1 hour ago

జగన్‌పై షర్మిల ఘాటు వ్యాఖ్యలు… రాజకీయాల్లో వేడి పెరిగింది

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదిరింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైసీపీ అధినేత వైఎస్ జగన్…

2 hours ago

మీడియాపై దాడులు సహించను: వెంకయ్య నాయుడు స్పష్టమైన హెచ్చరిక

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మీడియా స్వేచ్ఛ, మాతృభాష ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో నిర్వహించిన ఎన్పీ సావిత్రమ్మ…

2 hours ago

విడుదలకు ముందే రికార్డులు.. ‘డెకాయిట్’ అడ్వాన్స్ బుకింగ్స్ సునామీ

యంగ్ హీరో అడవి శేష్ నటించిన తాజా చిత్రం ‘డెకాయిట్’ విడుదలకు ముందే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

3 hours ago