బిగ్ బాస్ సీజన్ 5 రియాల్టీ షో లో మూడు వారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్లతో మొదలైన రియాల్టీ షో ప్రస్తుతం 16 మంది మిగిలారు. ఎవరూ ఊహించని విధంగా మూడో వారం లహరి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి ప్రియా ఎలిమినేట్ అవుతుంది అనుకున్నారు.. కానీ హౌస్ మేట్స్ కూడా షాక్ అయ్యే విధంగా లహరి బయటకు వచ్చింది.
ఆమె పై అంత నెగిటివిటీ రావడానికి కారణం రవి.. ప్రియాతో అన్న మాటలే అని తెలుస్తోంది. ‘సింగిల్ మెన్’ అనే పదాన్ని యాంకర్ రవి ప్రియాతో మాట్లాడారు కాబట్టే.. ఆమె ఎలిమినేషన్ లో ప్రస్తావించాల్సి వచ్చిందంటూ ప్రియా తెలిపారు.
దీంతో కథ అంతా అడ్డం తిరిగింది. ఇదంతా ఇలా ఉండగా.. ఆమెకు బిగ్బాస్ షో నుంచి ఎంత ముట్టిందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ గా మారింది. అదేంటంటే.. ఆమెకు వారానికి రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు పారితోషికంగా ఇస్తున్నారట. ఈ లెక్కన ఆమెకు మూడు వారాలకు లెక్కలు వేసుకుంటే దాదాపు రూ.5లక్షలకు పైగా సంపాదించిందంటూ చెబుతున్నారు.
అయితే నాగార్జున దగ్గరకు వచ్చిన లహరి కాస్త ఎమోషనల్ అయినట్లు కనిపించింది. తాను ఏ తప్పు చేశానో అర్థం కాలేదంటూ నాగార్జునకు తెలిపారు. ఇక బిగ్ బాస్ బజ్ లో కూడా ఒకొక్కరి గురించి ఈ అమ్ము తన అభిప్రాయాలను పంచుకుంది యాంకర్ అరియానాతో.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…