Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ యూట్యూబర్ గా ఒక రైతు బిడ్డగా రైతుల పడే కష్టాలన్నీటిని తెలియజేస్తూ రైతుబిడ్డగా మంచి ఆదరణ సంపాదించుకున్నారు. అయితే ఈయనకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అన్నది ఎప్పటినుంచో కోరికగా ఉంది అంటూ తరచూ తన వీడియోలు ద్వారా తెలియజేసేవారు. దీంతో ఈయన బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇలా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి పల్లవి ప్రశాంత్ మొదటి నుంచి కూడా తన ఆట తీరుతో అందరిని మెప్పించి భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇలా ఒక కామన్ మ్యాన్ గా హౌస్ లోకి వచ్చినటువంటి ఈయన చివరికి కప్పు గెలుచుకొని బిగ్ బాస్ విన్నర్ గా బయటకు వచ్చారు. ఇక పల్లవి ప్రశాంత్ గెలవడంతో బిగ్ బాస్ వేదికపై ఈయన మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. తనకు బిగ్ బాస్ కార్యక్రమమంటే చాలా ఇష్టం అని అయితే ఈ కార్యక్రమానికి రావడం కోసం నేను ఎంతో కష్టపడ్డాను అని తెలిపారు. కొన్నిసార్లు పస్తులు కూడా ఉన్నానని అయితే ఈ విషయాలన్నింటిని మా ఇంట్లో వారికి తెలియనివ్వలేదని తెలిపారు.
ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో గెలుచుకున్నటువంటి ప్రైజ్ మనీ గురించి కూడా మరోసారి వేదికపైనే ప్రశాంత్ మాట్లాడారు తాను గతంలో రైతుల కోసమే ఆ డబ్బు ఉపయోగిస్తానని చెప్పాను ఇప్పుడు కూడా అదే మాటపై ఉన్నానని తెలిపారు. ఎవరైతే కష్టాలలో ఉన్నారో అలాంటి రైతులకు తన ప్రైజ్ మనీ ఇచ్చేస్తానని ప్రశాంత్ తెలిపారు.
కారు నాన్నకు..నగలు అమ్మకు..
ఇక విన్నర్ కు ప్రైజ్ మనీ తో పాటు ఒక కారు అలాగే జోయాలుకాస్ వారి బంగారు ఆభరణాలను కూడా అన్ని ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అయితే కారును తన తండ్రికి ఇస్తానని బంగారం తన తల్లికి ఇస్తాను అంటూ ఈ సందర్భంగా ప్రైజ్ మనీ గురించి పల్లవి ప్రశాంత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ విషయంలో తగ్గేదే లేదంటూ ప్రశాంత్ తన స్టైల్లో చెప్పుకు వచ్చారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…