Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సమంత దాదాపు దశాబ్ద కాలం పైగా ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగారు కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళ భాషలో కూడా హీరోయిన్గా వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి సమంత వ్యక్తిగత జీవితంలో మాత్రం కాస్త ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహ బంధం ఎక్కువ కాలం పాటు కొనసాగలేదని తెలుస్తోంది. ఇలా విడాకులు తీసుకొని విడిపోయినటువంటి ఈమె భయంకరమైనటువంటి మయోసైటిస్ బారిన పడ్డారు ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం సమంత పలు ప్రదేశాలకు వెళ్తూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.
అయితే ఈమె ఆరోగ్యపరంగా కాస్త కోలుకున్నారని తెలుస్తుంది. దీంతో ఇండస్ట్రీలోకి రావడానికి కూడా సిద్ధమయ్యారు అయితే సమంత ఇప్పటివరకు హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగారు. ఇకపై నిర్మాతగా కూడా కొనసాగుతారని తెలుస్తోంది. ఇలా కెరియర్ పరంగా తిరిగి ఈమె బిజీ కానున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.
మళ్లీ పెళ్లి చెడు పెట్టుబడి…
దీంతో ఈమె రెండో పెళ్లి గురించి కూడా ఒక నేటిజన్ ప్రశ్న వేశారు రెండో పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారా అంటూ అడగడంతో ఈమె రెండో పెళ్లి గురించి కొన్ని లెక్కలు కూడా చెప్పారు.కీ డివోర్స్ స్టాటిస్టిక్స్ అనే నివేదికని షేర్ చేసి దీని ప్రకారం మళ్ళీ పెళ్లి అనేది చెడు పెట్టుబడి అవుతుందనీ తెలిపారు. మొదటిసారి పెళ్లి చేసుకున్న వాళ్ళే 50 శాతం మంది విడిపోతున్నారు ఇక రెండో పెళ్లి చేసుకున్న వారు 65% మంది మూడో పెళ్లి చేసుకున్న వారు 70 శాతం మంది విడిపోతున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే సమంత సమాధానం చూస్తే తాను రెండో పెళ్లి చేసుకున్న కూడా విడాకులే తప్పవు అంటూ కామెంట్ చేశారని తెలుస్తోంది.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…