బుల్లితెరపై ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మొదటివారం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలోనే మొదటి వారం నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో యాంకర్ రవి, మానస్, కాజల్, హమీద, సరియు,జెస్సి నామినేట్ కాగా వీరిలో సరయు ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ చేశారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ హౌస్ లో ది బెస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ ఐదుగురు సభ్యులను సెలెక్ట్ చేసింది.
ది బెస్ట్ కంటెస్టెంట్ అంటూ సరియు శ్వేత, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద బెస్ట్ హౌస్మేట్స్ అంటూ వారిపై ప్రశంసలు కురిపించింది. అదే విధంగా ది వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ సిరి, షణ్ముఖ్, సన్నీ, లహరి, కాజల్ అంటూ వారి పేర్లను తెలియజేసింది. కాజల్ ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో పడాలని ఆరాటపడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదు అంటూ సరియు తెలియజేశారు. ఇకపోతే సిరి, షణ్ముఖ్ వీరిద్దరూ ముందుగానే ఒక ప్లాన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని ఆ ప్లాన్ ప్రకారమే ఆట ఆడుతున్నారు తప్ప నిజాయితీగా ఆడటం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా అసలు ఆట ఆడండి నిజాయితీగా ఆడండి అంటూ సిరి, షణ్ముఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సన్నీ గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ఇదివరకే ఒక సినిమాలో కలిసి నటించారు. అక్కడ వచ్చిన భేదాభిప్రాయాలు గురించి సన్నీ హౌస్ లో చూపిస్తున్నాడని సన్నీ గురించి తెలియజేసింది. ఇక లహరిని సరియు ఓ ఆటాడుకుందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా లహరి గురించి మాట్లాడుతూ ముందు నీ వాయిస్ కంట్రోల్ చేసుకో, ఏమీ లేని వారే ఎగిరెగిరి పడుతుంటారు లహరి ఇతరులపై పెద్దగా అరుస్తూ ఉంటుందని ముందుగా అది తగ్గించుకో అంటూ తెలిపారు ఇలా ఒకరిని తొక్కుతూ ఎదగడం మంచిది కాదు నీది ఏదైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి సరయు ఉన్నది హౌస్లో ఒక వారమే అయినప్పటికీ ఇవ్వాల్సిన వారికి భారీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…