బుల్లితెరపై ఎంతో ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న బిగ్ బాస్ కార్యక్రమం మొదటివారం ఎంతో విజయవంతంగా పూర్తయింది. ఈ క్రమంలోనే మొదటి వారం నామినేషన్ కి సెలెక్ట్ అయిన వారిలో యాంకర్ రవి, మానస్, కాజల్, హమీద, సరియు,జెస్సి నామినేట్ కాగా వీరిలో సరయు ఈ వారం ఎలిమినేట్ కాబోతుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. అయితే ఆదివారం నాగార్జున బిగ్ బాస్ హౌస్ నుంచి కంటెస్టెంట్ సరయు ఎలిమినేట్ చేశారు. ఇలా హౌస్ నుంచి బయటకు వచ్చిన సరయు స్టేజ్ పై నాగార్జునతో మాట్లాడుతూ హౌస్ లో ది బెస్ట్ వరస్ట్ కంటెస్టెంట్స్ అంటూ ఐదుగురు సభ్యులను సెలెక్ట్ చేసింది.
ది బెస్ట్ కంటెస్టెంట్ అంటూ సరియు శ్వేత, మానస్, ప్రియాంక, విశ్వ, హమీద బెస్ట్ హౌస్మేట్స్ అంటూ వారిపై ప్రశంసలు కురిపించింది. అదే విధంగా ది వరెస్ట్ కంటెస్టెంట్స్ అంటూ సిరి, షణ్ముఖ్, సన్నీ, లహరి, కాజల్ అంటూ వారి పేర్లను తెలియజేసింది. కాజల్ ఎప్పుడూ కూడా అందరి దృష్టిలో పడాలని ఆరాటపడుతున్నారని, ఇది సరైన పద్ధతి కాదు అంటూ సరియు తెలియజేశారు. ఇకపోతే సిరి, షణ్ముఖ్ వీరిద్దరూ ముందుగానే ఒక ప్లాన్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారని ఆ ప్లాన్ ప్రకారమే ఆట ఆడుతున్నారు తప్ప నిజాయితీగా ఆడటం లేదంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు.
ఇప్పటికైనా అసలు ఆట ఆడండి నిజాయితీగా ఆడండి అంటూ సిరి, షణ్ముఖ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సన్నీ గురించి మాట్లాడుతూ వీరిద్దరూ ఇదివరకే ఒక సినిమాలో కలిసి నటించారు. అక్కడ వచ్చిన భేదాభిప్రాయాలు గురించి సన్నీ హౌస్ లో చూపిస్తున్నాడని సన్నీ గురించి తెలియజేసింది. ఇక లహరిని సరియు ఓ ఆటాడుకుందని చెప్పవచ్చు.
ఈ సందర్భంగా లహరి గురించి మాట్లాడుతూ ముందు నీ వాయిస్ కంట్రోల్ చేసుకో, ఏమీ లేని వారే ఎగిరెగిరి పడుతుంటారు లహరి ఇతరులపై పెద్దగా అరుస్తూ ఉంటుందని ముందుగా అది తగ్గించుకో అంటూ తెలిపారు ఇలా ఒకరిని తొక్కుతూ ఎదగడం మంచిది కాదు నీది ఏదైనా ఉంటే నీ దగ్గర పెట్టుకో అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి సరయు ఉన్నది హౌస్లో ఒక వారమే అయినప్పటికీ ఇవ్వాల్సిన వారికి భారీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…