బుల్లితెరపై బిగ్ బాస్ కార్యక్రమం ఎంతో రసవత్తరంగా ప్రసారమవుతూ వారం రోజులను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ వారం హౌస్ నుంచి కంటెస్టెంట్ సరియు ఎలిమినేట్ అయ్యారు . ఈ విధంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లను బిగ్ బాస్ బజ్ కార్యక్రమానికి ఆహ్వానించి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈ నేపథ్యంలో బిగ్బాస్ సీజన్ 5 బజ్కు సంబంధించి లెటేస్ట్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. ఈసారి ఈ సీజన్ 5 బజ్కు బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ అరీయానా గ్లోరీ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. గత రెండు సీజన్ల నుంచి ఈ బిగ్ బాస్ బజ్ కార్యక్రమ నిర్వాహకులు ప్రారంభించారు.
గతంలో బిగ్ బాస్ సీజన్ త్రీ బజ్ హోస్ట్ గా తనిష్ వ్యవహరించగా సీజన్ ఫోర్ బజ్ హోస్ట్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హోస్ట్గా వ్యవహరించిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా సీజన్ ఫైవ్ బజ్ హోస్ట్ గా ఆరియానా వ్యవహరించనున్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా.. ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చిన సరియు బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా సరియు హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్ గురించి బోల్డ్ కామెంట్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సరయుని బిగ్ బాస్ బజ్ హోస్ట్ అరియానా సాదరంగా తనని ఆహ్వానించి బిగ్ బాస్ గురించి ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సరియు కంటెస్టెంట్ ల గురించి మాట్లాడుతూ ముందుగా సిరి ఫోటోను చూపిస్తూ.. హౌస్ లో మగవాళ్లను అడ్డం పెట్టుకొని ఆడుతుంది ఈ సిరి అంటూ తన ఫోటోని బద్దలు కొట్టింది.
అదేవిధంగా యాంకర్ రవి గురించి మాట్లాడుతూ… మంచి వాడి మాదిరి నీతి సూత్రాలు చెబుతాడు కానీ ఇతని దగ్గర విషయం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక సన్నీ ఫోటో చూపిస్తూ ఇతనికి క్యారెక్టరే లేదంటూ చెప్పుకొచ్చింది. ఈ విధంగా హోస్ట్ అరియానాతో మాట్లాడుతూ ఎలుకలే గుంపులుగా వస్తాయి.. సింహం సింగిల్ గా వస్తుంది. ఆ ఇంట్లో దమ్మున్న మగాడు ఒక్కడే విశ్వ అంటూ అతని పై ప్రశంసలు కురిపించింది సరియు.
ఇక కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ గురించి సరియు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజంగా నీలో దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివైతే అంటూ షణ్ముఖ్ జశ్వంత్ గురించి బోల్డ్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పూర్తి కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ఈరోజు ఉదయం 10 గంటలకు, తిరిగి సాయంత్రం 6 గంటలకు స్టార్ మా మ్యూజిక్ లో ప్రసారం కానుంది.
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…
మెదక్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. శివంపేట…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీకు బహిరంగ లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.…
సినిమా ఇండస్ట్రీలో హీరో–హీరోయిన్ల మధ్య వయసు తేడా ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశం కాకపోయినా, కొంతమంది నటులు మాత్రం తమ వ్యక్తిగత…
హైదరాబాద్ నగరంలో పోలీస్ కస్టడీలో ఉన్న ఓ మహిళా రిమాండ్ ఖైదీ ఆస్పత్రి నుంచి తప్పించుకోవడం కలకలం రేపింది. భద్రతా…
తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించే గరుడ వాహన సేవకు భక్తుల్లో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ…