Featured

చెల్లాచెదురైన జీవితాలు అంటూ ఏపీ వరదలపై స్పందించిన రాములమ్మ..!

గత కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు అధికంగా పడటంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది. ఇదిలా ఉండగా ఏపీ వరదలపై తాజాగా భారతీయ జనతా పార్టీ నాయకురాలు సినీ నటి విజయశాంతి స్పందించారు. తుఫాను ప్రభావం వల్ల రాయలసీమ దక్షిణ కోస్తాలోని పలు జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.

ఈ క్రమంలోనే విజయశాంతి స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది… ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్ కన్నీటి కడలిలా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు రాయలసీమ జిల్లాలను చూస్తే గుండె బరువెక్కుతోంది. అధిక వర్షం ప్రభావం కారణంగా వాగులు వంకలు పొంగి గ్రామాలను నీటిలో ముంచేశాయి.

కళ్ళ ముందే ఎన్నో మూగజీవాలు కుటుంబసభ్యులు కొట్టుకుపోతుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది అలాగే చేతికొచ్చిన పంట నాశనం కావడంతో ఎంతో మంది జీవితాలు చెల్లాచెదురై పోయాయి. వీరి జీవితాలు ఎప్పటికీ తేరుకు ఉంటాయో అంటూ విజయశాంతి ఎమోషనల్ ట్వీట్ చేశారు.ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వీరికి తోడుగా మానవవనరుల సహాయం అవసరం అనిపిస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తోడుగా ఎన్సీసీ విద్యార్థులను తీసుకుంటే త్వరగా ఈ విపత్కర పరిస్థితుల నుంచి బయట పడవచ్చు అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. రాయలసీమలోని పలు జిల్లాలలో వరద బీభత్సం అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అండగా నిలబడ్డాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

17 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

18 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago