BJP Leader Raghunandan reddy : తెలంగాణ రాజకీయంలో ఒకవైపు అధికార పార్టీ తెరాస మీద కొంచం సందు దొరికితే చాలు బీజేపీ పార్టీ ఆసలు వదలకుండా విమర్శలు గుప్పిస్తుంది. ఇక తెరాస అధినేత చంద్రశేఖర్ రావు గారు తెరాసను నేషనల్ పార్టీగా ప్రకటించిన తరువాత రాజకీయ వేడి మరింత ఎక్కువైంది. ఇక లిక్కర్ స్కాం ఎంత ప్రకంపణలు సృష్టించిందో తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కాం తీగ లాగితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో డొంక కదిలింది. ఇందులో చంద్రశేఖర్ రావు కూతురు కవిత, ఏపీ వైసీపీ నేతలు ఉండటంతో మరింత రాజకీయ వేడి రాజుకుంది. ఇక తాజాగా వినిపిస్తున్న వార్త కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారు అనే వార్త జోరుగా వినిపిస్తోంది. దీని గురించిన ఆసక్తికర విషయాలను బీజేపీ లీడర్ రఘునందన్ రెడ్డి గారు మాట్లాడారు.
కవితను కాపాడుకోడానికి కెసిఆర్ ఏమైనా చేస్తాడు…
కవితను లిక్కర్ స్కాంలో అరెస్ట్ చేస్తారు అనే వార్తలను నేపథ్యంలో రఘునందన్ రెడ్డి గారు మాట్లాడుతూ కవిత అరెస్ట్ అయితే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రాదు. కెసిఆర్ కుటుంబానికి ఏదైనా జరిగితే అది తెలంగాణ కు జరిగినట్లు ఆపాదించడం తప్పు. కెసిఆర్ కుటుంబం మాత్రమే తెలంగాణలో లేదు. కవిత నిజామాబాద్ లో ఎలా ఓడిపోయింది.
ఇక కవిత, కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కాకుండా తెరాసలో నేతలు లేరా, వాళ్లంతా ఎలా గెలిచారు, వారిని చూసి జనాలు ఓట్లేసారు. అంతే కానీ ఒక్క కవిత అరెస్టు తోనే బీజేపీ అధికారంలోకి వస్తుందనుకోవడం మూర్ఖత్వం అంటూ చెప్పారు. ఇక కవితను కాపాడుకోడానికి కెసిఆర్ ప్రయత్నించకుండా ఉంటాడా, పిల్లల్ని కాపాడుకోడానికి ఏ తండ్రి అయినా పోరాడుతాడు అంటూ చెప్పారు.
తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం నటీమణుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్న శివాత్మిక తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్లో గాయాల సమస్యలు జట్లకు తలనొప్పిగా మారుతున్నాయి. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇది పెద్ద…
తెలుగు సినీ పరిశ్రమలో తన సహజ నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రగతి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో…
తెలుగు సినీ పరిశ్రమలో నాలుగు దశాబ్దాలకు పైగా తన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందిన జయసుధ, ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో…
తెలుగు ప్రేక్షకులకు తన అందమైన నటనతో, మృదువైన వ్యక్తిత్వంతో దగ్గరైన నటి నాదియా తాజాగా తన సినీ ప్రయాణం, వ్యక్తిగత…
ఐపీఎల్ 2026 సీజన్లో యువ ఆటగాళ్ల ప్రదర్శనలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ…