Tarakaratna: నందమూరి తారకరత్న అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దాదాపు 23 రోజుల పాటు బెంగుళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 18వ తేదీ మరణించారు. ఇలా ఈయన మరణించడంతో తన భార్య అలేఖ్యరెడ్డి ఎంతో కృంగిపోయారు. ఇక ఈయన మరణించి దాదాపు నెలరోజులు కావస్తున్న ఇంకా తన భర్త మరణం నుంచి అలేఖ్య రెడ్డి బయటపడలేదని తెలుస్తుంది.
ఇక తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి తన పిల్లలను చూసుకుంటూ ఒంటరిగా మిగిలిపోయారు. అయితే తనకు ఎలాంటి కష్టం రాకుండా తన పిల్లల బాధ్యతలను చూసుకుంటానని బాలయ్య హామీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈమె బాలయ్య తన కుటుంబానికి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు.
బాలకృష్ణ తన ముగ్గురు పిల్లలతో కలిసి దిగిన ఫోటోలుతోపాటు తారకరత్న ఫోటోని కూడా మార్ఫింగ్ చేసినటువంటి ఫోటోని అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ… మా కుటుంబం అని పిలిచే ఏకైక వ్యక్తి ఆయనే…మేం కష్టంలో ఉన్నప్పుడు కొండల మాకు అండగా నిలిచారు. నిన్ను ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పుడు ఒక తండ్రిగా నీ వెంటే ఉన్నారు. ఇక నువ్వు ఆస్పత్రి బెడ్ పై ఉన్నప్పుడు పక్కనే కూర్చుని ఒక తల్లిలా లాలి పాడారు.
ఎవరు లేని సమయంలో నీకోసం ఏడ్చారు. తన సిల్లీ జోక్స్ తో నిన్ను నవ్వించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. నీ చివరి క్షణం వరకు ఆయన నీ వెంటే ఉన్నారు. ఓబు నువ్వు మరికొన్ని రోజులు బ్రతికి ఉంటే బాగుండేది. నిన్ను చాలా మిస్ అవుతున్నా అంటూ ఈ సందర్భంగా అలేఖ్య తన భర్తను తలుచుకొని ఎమోషనల్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…