Featured

BJP leader Subramanian Swamy : అదాని ఆస్తులను వేలం వేయాలి… ఆస్తులను జాతీయం చేయాలి… హాట్ కామెంట్స్ చేసిన బీజేపీ లీడర్ సుబ్రమణియన్ స్వామి…!

BJP Leader Subramanian Swamy : గుజరాత్ నుండి చిన్న వ్యాపారవేత్తగా మొదలయిన ఆదాని ప్రయాణం నేడు ప్రపంచ కుభేరుల జాబితాలో టాప్ 10 లోకి చేరింది. అయితే కొత్త సంవత్సరం టాప్ 10 లో ఉన్న ప్రపంచ కుభేరులలో కేవలం ఆదాని సంపద మాత్రమే తరిగిపోయి టాప్ ప్లేసులో ఉన్న తనకు ఏడో స్థానానికి దిగజారాడు. గత కొద్ది రోజులుగా స్టాక్ ఎక్స్చేంజ్ లో మోసాలకు పాల్పడినట్లు ఆదాని గ్రూప్ మీద వార్తలు వెలువడ్డాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్లో మోసాలకు పాల్పడినట్లు ప్రముఖ పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపించింది. అమెరికాకు చెందిన ఈ కంపెనీ దాదాపు రెండున్నరేళ్ల పాటు చేసిన పరిశోధనలలో అదానీ గ్రూప్ తన స్టాక్స్‌లో భారీ అవకతవకలకు పాల్పడుతోందని, అకౌంటింగ్ మోసాలు కూడా చేస్తోందని ఆరోపణలు గుప్పించింది. దశాబ్దాల కాలంగా స్టాక్ మానిపులేషన్‌ జరుగుతోందని, అకౌంటింగ్ ఫ్రాడ్ స్కామ్ జరుగుతోందని పరిశోధన రిపోర్ట్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ రిపోర్ట్ వెలువడడంతో ఒక్కసారిగా ఆధాని గ్రూప్ స్టాక్స్ పడిపోయి దాదాపు ఒక్కరోజులోనే 5.9 బిలయన్ డాలర్ల సంపద అంటే ఇండియన్ కరెన్సీ లో దాదాపుగా 49 వేల కోట్ల సంపద అవిరైపోయింది.

ఆస్తులను జాతీయం చేయాలి…

ఈ ఇష్యూ మీద బీజేపీ లీడర్ సుబ్రమణియన్ స్వామి హాట్ కామెంట్స్ చేసారు. అదాని ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వేలం వేయాలని సూచించారు. అలా వేలం వేయగా వచ్చిన డబ్బులను స్టాక్స్ లో నష్టపోయిన వారికి ఇవ్వాలని, ఇలా చేసి బీజేపీ తన పవిత్రతను నిరూపించుకోవాలని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లలో కొంతమందికి అదానితో స్నేహాలు ఉన్నాయని, అయినా నేను కాంగ్రెస్ గురించి పట్టించుకోవడం లేదంటూ ప్రభుత్వం అదాని విషయంలో ఏ మాత్రం సమర్తించడం లేదు అనే విషయం బయటికి తెలిసేలా చేయాలంటూ సుబ్రమణియన్ స్వామి తెలిపారు.

ఇక నిర్మలా సీతారామన్ బడ్జెట్ గురించి హాట్ కామెంట్స్ చేసారు సుబ్రమణియన్. అసలు బడ్జెట్ నమ్మశఖ్యంగా లేదంటూ కామెంట్స్ చేసారు. ఇంతవరకు వృద్ధి రేటు 3 లేక 4 శాతం దాటకుండా ఉంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనా 6.5 శాతంగా ఆర్థిక మంత్రి ప్రకటించడం విడ్డూరంగా ఉందని బడ్జెట్ లో వ్యవసాయం, పరిశ్రమల ఊసే లేదంటూ విమర్శించారు.

Bhargavi

Recent Posts

పూజ తర్వాత తీర్థం ఎలా తీసుకోవాలో మీకు తెలుసా? చాలా మందికి తెలియని తీర్థం నియమాలు ఇవే!

హిందూ ఆచారాల్లో పూజ అనంతరం తీర్థం స్వీకరించడం ఒక పవిత్రమైన సంప్రదాయం. ఇది కేవలం నీటిగా కాకుండా, మంత్రోచ్ఛారణతో పవిత్రత…

14 minutes ago

బీపీ 200 దాటితే ఎంత ప్రమాదమో తెలుసా? నిపుణుల హెచ్చరిక!

రక్తపోటు సమస్యను చాలా మంది సాధారణంగా తీసుకుంటుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో ఇది ఒక్కసారిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా…

44 minutes ago

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

2 hours ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

10 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

10 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

10 hours ago