దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల వల్ల పంట మంచి రేటుకే అమ్ముడయినా రైతులకు లాభాలు రావడం లేదు. అయితే కొన్ని పంటలు వేస్తే రైతులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల పంట చేతికి వచ్చినా నష్టాలు చవిచూసిన రైతులు మంచి రేటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక మొత్తంలో ఆదాయాన్ని సులువుగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటల్లో బ్లాక్ వీట్(నల్ల గోధుమలు) ఒకటి. రైతులు ఈ పంట ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని, ఎక్కువ లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.
సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలకు నాలుగు రెట్లు ఎక్కువ ధరను పొందవచ్చు. క్వింటాల్ నల్ల గోధుమల ధర 8,000 రూపాయలకు పైగా పలుకుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నల్లగోధుమలు అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు నల్ల గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి.
ఐరన్ లోపంతో బాధ పడే వాళ్లకు సైతం ఆ సమస్యను దూరం చేయడంలో బ్లాక్ వీట్ సహాయపడుతుంది. శీతాకాలం ఈ పంటను పండించటానికి అనువైన కాలం. ఫర్టిలైజర్ దుకాణాలలో ఈ పంటకు సంబంధించిన విత్తనాలు లభిస్తాయి.
బెంగుళూరులో బాలికపై జరిగిన అమానుష ఘటన తీవ్ర ఆగ్రహానికి దారి తీసింది. ఇంటి బయట ఆడుకుంటున్న 11 ఏళ్ల చిన్నారిని…
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటుడిగా ప్రత్యేక గుర్తింపు పొందిన రాజశేఖర్ తన కెరీర్లో కొత్త దశను ఆత్మవిశ్వాసంతో ముందుకు…
గ్రహాల సంచారం మనిషి జీవితంపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. ముఖ్యంగా ప్రేమ, వివాహం, సౌఖ్యం వంటి అంశాలకు…
దక్షిణ భారత సినీ పరిశ్రమలో ప్రముఖ జంటగా పేరొందిన నయనతార – విఘ్నేష్ శివన్ తాజాగా తిరుమల శ్రీవారి ఆలయంను…
దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన, విస్తీర్ణం పరంగా అగ్రగామిగా నిలిచిన క్షేత్రాల్లో ఒకటి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం. ‘భూలోక వైకుంఠం’గా…
మన రోజువారీ సంభాషణల్లో “పెద్ద కళ్లు”, “చిన్న కళ్లు” అనే మాటలు తరచూ వినిపిస్తుంటాయి. రూపురేఖల పరంగా ఇది ఒక…