కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ప్రతి సంవత్సరం మే, జూన్ నెలలలో జరిగే పోటీ పరీక్షలు ఈ సంవత్సరం ఆలస్యంగా జరుగుతున్నాయి. అయితే గతంతో పోలిస్తే కరోనా విజృంభణ తగ్గడంతో ఐబీపీఎస్ 647 ఉద్యోగాలను సీఆర్పీ(కామన్ రికూట్మెంట్ ప్రాసెస్) ద్వారా భర్తీ చేయనుంది. లా ఆఫీసర్, రాజ్ భాష అధికారి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్లు, ఐటీ ఆఫీసర్ల ఉద్యోగులను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఈ నెల 23వ తేదీలోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 1వ తేదీ నాటికి 30 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఎంపికవుతారు. డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష, 2021 జనవరి 24వ తేదీన మెయిన్ పరీక్ష జరుగుతాయి. ఈ ఉద్యోగాలకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 175 రూపాయలు, మిగిలిన అభ్యర్థులు 850 రూపాయలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఉద్యోగాలలో ఐటీ ఆఫీసర్లు 20, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 485, రాజ్ భాష అధికారి 25, లా ఆఫీసర్ 50, హెచ్.ఆర్ 7, మార్కెటింగ్ ఆఫీసర్ 60 ఉద్యోగాలు ఉన్నాయి. https://www.ibps.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు.
ఐబీపీఎస్ ఈ ఉద్యోగాలతో పాటు మరికొన్ని ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. వరుసగా నోటిఫికేషన్లు విడుదలవుతూ ఉండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…