దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల వల్ల పంట మంచి రేటుకే అమ్ముడయినా రైతులకు లాభాలు రావడం లేదు. అయితే కొన్ని పంటలు వేస్తే రైతులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల పంట చేతికి వచ్చినా నష్టాలు చవిచూసిన రైతులు మంచి రేటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక మొత్తంలో ఆదాయాన్ని సులువుగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటల్లో బ్లాక్ వీట్(నల్ల గోధుమలు) ఒకటి. రైతులు ఈ పంట ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని, ఎక్కువ లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.
సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలకు నాలుగు రెట్లు ఎక్కువ ధరను పొందవచ్చు. క్వింటాల్ నల్ల గోధుమల ధర 8,000 రూపాయలకు పైగా పలుకుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నల్లగోధుమలు అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు నల్ల గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి.
ఐరన్ లోపంతో బాధ పడే వాళ్లకు సైతం ఆ సమస్యను దూరం చేయడంలో బ్లాక్ వీట్ సహాయపడుతుంది. శీతాకాలం ఈ పంటను పండించటానికి అనువైన కాలం. ఫర్టిలైజర్ దుకాణాలలో ఈ పంటకు సంబంధించిన విత్తనాలు లభిస్తాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…