దేశంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని కొత్త పథకాలు అమలు చేస్తున్నా రైతుల జీవితాల్లో మాత్రం పెద్దగా మార్పు రావడం లేదు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులకు అకాల వర్షాలు, వరదలు నష్టాలను మిగులుస్తున్నాయి. పెరుగుతున్న మందులు, ఎరువుల రేట్ల వల్ల పంట మంచి రేటుకే అమ్ముడయినా రైతులకు లాభాలు రావడం లేదు. అయితే కొన్ని పంటలు వేస్తే రైతులు మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది.
కరోనా, లాక్ డౌన్ వల్ల పంట చేతికి వచ్చినా నష్టాలు చవిచూసిన రైతులు మంచి రేటు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను పండిస్తే అధిక మొత్తంలో ఆదాయాన్ని సులువుగా సంపాదించవచ్చు. ప్రస్తుతం మార్కెట్ లో డిమాండ్ ఎక్కువగా ఉన్న పంటల్లో బ్లాక్ వీట్(నల్ల గోధుమలు) ఒకటి. రైతులు ఈ పంట ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడిని, ఎక్కువ లాభాలను సులువుగా పొందే అవకాశం ఉంటుంది.
సాధారణ గోధుమలతో పోలిస్తే ఈ గోధుమలకు నాలుగు రెట్లు ఎక్కువ ధరను పొందవచ్చు. క్వింటాల్ నల్ల గోధుమల ధర 8,000 రూపాయలకు పైగా పలుకుతుంది. పోషకాలు పుష్కలంగా ఉండే నల్లగోధుమలు అనేక వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తాయి. షుగర్, ఒబెసిటీ, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు నల్ల గోధుమలతో చేసిన ఆహారం తీసుకుంటే ఆ సమస్యలు తగ్గుముఖం పడుతాయి.
ఐరన్ లోపంతో బాధ పడే వాళ్లకు సైతం ఆ సమస్యను దూరం చేయడంలో బ్లాక్ వీట్ సహాయపడుతుంది. శీతాకాలం ఈ పంటను పండించటానికి అనువైన కాలం. ఫర్టిలైజర్ దుకాణాలలో ఈ పంటకు సంబంధించిన విత్తనాలు లభిస్తాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…