కరోనా లాక్డౌన్ సమయంలో వేలాది కార్మికులకు అండగా నిలిచి రియల్ హీరోగా మారాడు నటుడు సోనూసూద్.లక్షలాది మంది ప్రజలకు ఆహారం అందించడంతోపాటు వాహనాల్లో వారి వారి స్థానాలకు చేర్చాడు. అయితే సోను సూద్ సినిమాలలో చేసేది విలన్ పాత్రలే అయినప్పటికీ..సాయం కావాలంటూ తనదగ్గరకు వచ్చినవారందరికీ ఇప్పటికీ సోనూసూద్ సహాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా ముద్రవేసుకున్నాడు.
అయితే వేలాదిమంది దేవుడిగా పూజిస్తున్న సోనూసూద్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది అంటూ అతనిపై కక్షపూరితంగా ఐటి, ఈడి దాడులు జరిపించారు. సోను సూద్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు మరింత ఉధృతం చేసింది. ముంబైలోని సోనుసూద్ నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో దాడులు చేశాయి.వాటికీ సోనూ సూద్ భయపడ్డానని కూడా తెలిపారు.
ప్రస్తుతం సోనూసూద్ పై ఐటీ శాఖ చేస్తున్న దాడులకు రాజకీయ పరమైన కారణాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇలా ఉంటే తాజాగా సోనూసూద్ కు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మరొకసారి షాకిచ్చింది. ఆరు అంతస్తుల నిర్మాణాన్ని హోటల్ గా మార్చారని సోనూసూద్ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఆరు అంతస్థుల బిల్డింగ్ నిర్మాణంకాగా. దానిని హోటల్ గా మార్చారని.. దానిని తిరిగి ఇంటికి పునరుద్ధరించాలని నవంబర్ 15న నోటీసులు జారీ చేసింది.
మహారాష్ట్రకు చెందిన హక్కుల కార్యకర్త గణేష్ కుస్ములు సోను సూద్ బిఎంసికు కంప్లైంట్ చేశారు. రెసిడెన్షియల్ భవనాన్ని బాలికల వసతి గృహంగా మార్చారని దానిని హోటల్ గా మార్చారని.. ఇది ఇల్లీగల్ నిర్మాణం అంటూ అతను తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతే కాకుండా ఆ బిల్డింగ్ ను కూల్చేయాలని కోరారు. తాజాగా బిఎంసి పంపిన నోటీసులో భవనంలోని ఒకటి నుంచి ఆరు అంతస్తులలో మీరు వసతి బోర్డింగ్ కార్యకలాపాలను నిలిపి వేసినట్లు ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…