Movie News

నన్ను బద్నాం చేసారు..! మీడియా ఛానల్స్ కి చురకలు అంటించిన మెగాస్టార్ !

తాజాగా ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి అప్పట్లో ప్రజా అంకిత యాత్ర సమయంలో జరిగిన పలు విషయాల గురించి మాట్లాడుతూ మీడియాకు సున్నితంగా చురకలంటించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి 2009 ఎన్నికలకు ముందు ప్రజా అంకిత యాత్ర చేశారు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆయన బస్సులో తిరిగారు. ఈ క్రమంలోనే చిరంజీవి అభిమానులతో పాటుగా ప్రజలను కలవడం జరిగింది.

ఈ నేపథ్యంలోనే చిరంజీవికి ఎదురైనా పలు చేదు సంఘటనల గురించి గుర్తు చేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యాత్రలో భాగంగా ప్రజలతో కలిసిపోయి, కొంతమందిని ఆలింగనం చేసుకుని షేక్ హ్యాండ్ కూడా ఇచ్చానని తెలిపారు . అలా ఒక స్టేషన్ లో స్పీచ్ ముగిసిన తరువాత నెక్స్ట్ స్టేషన్ కి బస్సులో ఉన్నప్పుడు నాలుగు మీడియా చానల్స్ చిరంజీవిని తరచూ ఫాలో చేస్తున్నాయట.

అయితే ఆ మీడియా చానల్స్ చిరంజీవి పై ప్రేమతో కాకుండా పొరపాటు జరిగితే దాన్ని హైలైట్ చేసి చూపించాలి అన్న తపనతో చిరంజీవిని ఫాలో అవుతున్నారట. ఇక బస్సులో సీట్లో కూర్చున్న చిరుకి వాళ్ళ బాబాయ్ తినడానికి ఖర్జూరాలు ఇచ్చిన సమయంలో వాటిని తినడం కోసం చేతులు శుభ్రం చేసుకున్నాడట. దానిని వారు వీడియో తీసి చేతులు శుభ్రం చేసుకున్న వీడియో పక్కన పెట్టి అభిమానులకు షేక్ హ్యాండ్ ఇవ్వగానే చేతులు శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నట్టుగా వీడియోని ఎడిట్ చేశారట.

చేతులు శుభ్రం చేసుకుంటున్న వీడియోని పదేపదే చూపిస్తూ చిరంజీవి ఫ్యాన్స్ అంటే అంత అంటరాని వాళ్ళు అయ్యారా?ప్రజల్ని తాకడమంటే ఆయనకు అంత అసహ్యమా? అంటూ చిరంజీవిని టార్గెట్ చేశారట. అందుకే ఇప్పుడుమైక్ పైన శానిటైజర్ చేద్దామన్నా భయం వేస్తుంది. మీడియా దీనిని ఎలా ప్రచారం చేస్తుందో చెప్పలేం.. అంటూ చిరంజీవి రాజకీయ ప్రస్థానంలో ఎదురైన చేదు అనుభవం గుర్తు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago